
కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలకు చార్జీలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉచితంగా యూపీఐ సౌకర్యం ఉపయోగించుకోగా.. ఇక నుంచి వ్యాపారులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) అమలు చేసేందుకు సిద్దమైంది. వ్యాపారుల వద్ద రూ.2 వేలుపైబడి చేసే ట్రాన్సాక్షన్లకు 0.4 శాతం యూపీఐ ఛార్జీలు విధించనుంది. ఇక ఇన్సూరెన్స్, సిప్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్, సెక్యూరిటీల చెల్లింపులకు వేర్వేరుగా ఛార్జీలు పడనున్నాయి. అక్టోబర్ 15వ తేదీ నుంచి వీటిని అమలు చేయనున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది. వేటిపై ఎంతెంత చార్జీలు ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం.





