
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. భర్త మృతి చెందిన విషయం తెలిసిన కొద్దిసేపటికే భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.





