
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్త్తుతం కేరళలో ఉండి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్, అక్కడి నాయకులతో కలిసి త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ సంప్రదాయం ప్రకారం పంచెకట్టులో వెళ్లి శ్రీకృష్ణునికి, శ్రీరామ స్వామి, అయ్యప్పస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి అక్కడ జరిగే దీపాలంకరణ, మీనుట్టు, వేది వజిపాడు సేవల్లో పాల్గొన్నారు.





