
IRCTC ‘Oriental Odisha’ Tour Telugu: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలను ఒకే టూర్లో ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు IRCTC ‘Oriental Odisha’ (SHA42) ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. 2026 డిసెంబర్ 3 నుంచి 7 వరకు 4 రాత్రులు, 5 రోజుల పాటు ఈ ప్యాకేజీ కొనసాగుతుంది. టూర్లో భాగంగా పూరీ, చిలికా సరస్సు, కోణార్క్, భువనేశ్వర్, జాజ్పూర్లోని బిరాజా దేవి శక్తిపీఠం, రత్నగిరి బౌద్ధ అవశేషాలు వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.





