
ముంబయిలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా వినాయక మండపంలో ఏటా విభిన్న సామాజిక అంశాలతో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈసారి గ్లెనెగల్స్‌ ఆసుపత్రి, లాల్‌బాగ్‌చా రాజా సార్వజనిక్‌ గణేశోత్సవ్‌ మండల్‌ సంయుక్తంగా ఆశల అవయవాలు (ఆర్గాన్స్‌ ఆఫ్‌ హోప్‌) అనే ఇతివృత్తంతో అవగాహన ప్రచారాన్ని చేపట్టాయి. మండపంలో సుమారు 30 అడుగుల ఫైబర్‌గ్లాస్‌ మానవ అవయవాల శిల్పాన్ని ఏర్పాటుచేశాయి. మరణానంతర అవయవదానంపై ప్రజల్లో అపోహలను తొలగించటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ భారీ ఫైబర్‌గ్లాస్‌ శిల్పానికి ‘అతిపెద్ద మానవ అవయవాల ఫైబర్‌గ్లాస్‌ నిర్మాణం’గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ లభించిందని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





