
ఐపీఎల్ 2027 మినీ వేలం భారతదేశంలోనే జరగనుంది. అయితే 2008 నుంచి ఐపీఎల్ వేలం వేదికల ప్రయాణం ఆసక్తికరంగా మారింది. తొలి ఆక్షన్ 2008లో ముంబైలో జరగ్గా, బెంగళూరు అత్యధికంగా 7 సార్లు వేలానికి ఆతిథ్యమిచ్చింది. 2023లో కొచ్చిలో జరిగిన తర్వాత 2024 (దుబాయ్), 2025 (జెడ్డా), 2026 (అబుదాబి)లలో విదేశీ గడ్డపై ఆక్షన్స్ జరిగాయి. ఇప్పుడు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆటగాళ్ల వేలం స్వదేశానికి చేరింది.




