
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రైవేటు దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్ గౌతమ్ సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదివరకు మండల పరిధిలోని కటికన పల్లి గ్రామంలో పల్లె దవాఖాన డాక్టర్ గా పనిచేసి గత రెండు నెలల క్రితం రాజీనామా చేశాడు. కుటుంబ సమస్యలతో అవివాహితుడైన డాక్టర్ ఉరివేసుకొని మరణించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





