
Chandrababu Naidu Calls Everyone To Be Partners In Nation Building
ప్రజలు, ఉద్యోగులు, అధికారుల సమష్టి భాగస్వామ్యంతో 'పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారు
ప్రజలు, ఉద్యోగులు, అధికారుల సమష్టి భాగస్వామ్యంతో 'పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా 'రోడ్ డాక్టర్' పేరుతో 'జీరో పాట్ హోల్ మిషన్'ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరంగా చేరువ చేయడం ద్వారా ప్రతి ఒక్కరినీ జాతి నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టేలా 'రోడ్ డాక్టర్' కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో చేపట్టినప్పుడు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని, భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతికి లభిస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తే వారే ప్రభుత్వానికి అండగా నిలుస్తారని, కర్నూలులో డీఎస్సీ-2025 ఉపాధ్యాయ అభ్యర్థులు చేపట్టిన కార్యక్రమమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. జులై నెలలో రాష్ట్రం 10.70 శాతం ఆర్థిక వృద్ధిని సాధించిందని వెల్లడించిన ఆయన, రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో






