
మేత కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆవుల మందలోంచి ఓ ఆవు సాయంత్రానికి తిరిగి రాలేదంటే.. అక్కడ పులి మాటు వేసిందని అర్థం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో ఆవులు తప్పిపోవడమో లేదా దొంగలు ఎత్తుకెళ్లడమో జరిగేది. కానీ ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో, వన్యప్రాణులు అటవీ సరిహద్దు గ్రామాల్లోని శివారు ప్రాంతాల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రధానంగా పెద్దపులులు ఆహారం, నీటి కోసం సమీప ప్రాంతాల్లో మాటు వేస్తుండటంతో గత నెల రోజులుగా పశువుల కాపరులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.





