
మధ్యప్రదేశ్ జైలులో సినిమాను మించిన సీన్!
మధ్యప్రదేశ్ జైలులో సినిమాను మించిన సీన్!

మధ్యప్రదేశ్ జైలులో సినిమాను మించిన సీన్!

Andhra Pradesh: నీటి చుక్క పడితే చీమలు వస్తాయ్.. వెంకన్నకు అభిషేకమే చెయ్యని ఆ గుడి గురించి తెలుసా?

Andhra Pradesh: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..

Andhra Pradesh: నేటికి 124 ఏళ్లు.. దేశంలోనే తొలి రైలు ప్రమాదం ఏపీలో ఎక్కడ జరిగిందో తెలుసా..?

Andhra Pradesh: దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..

Uttar Pradesh | మద్యం మత్తులో సర్జరీ చేసిన డాక్టర్.. బాబుకు జన్మినిచ్చి గర్భిణి మృతి

Andhra Pradesh: పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇంటి వద్దకే వచ్చేస్తారు.. ఎక్కడికి వెళ్లాల్సిన అక్కర్లేదు..

Andhra Pradesh: ఇకపై ఆ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ఉచిత బస్సు పథకంపై ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్..

Andhra Pradesh: ఏపీ పర్యాటకానికి సరికొత్త ఊపు.. గంటల ప్రయాణం ఇక నిమిషాల్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్లపై కూటమి ప్రభుత్వం బిగ్ అప్డేట్.. ఒక్కసారి ఇది చెక్ చేస్కోండి..

Andhra Pradesh: కొత్తగా పింఛన్ అప్లై చేసుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ డాక్యుమెంట్స్ లేకున్నా ఓకే..

Andhra Pradesh: అబార్షన్ పిల్స్ మింగిన 17 ఏళ్ల బాలిక.. మూడో రోజే దారుణం!

పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లా పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం, "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.బుధవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ను పోలీస్ స్టేషన్కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసింది.కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని పేర్కొన్న కోర్టు, గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

దశాబ్దాల కాలం నాటి కల సాకారమైంది. ఉత్తరాంధ్ర బీళ్లకు జీవం పోసేందుకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ తరలివచ్చింది. ఈ చారిత్రక ఘట్టంతో పులకించిపోయిన ఉత్తరాంధ్ర రైతులు, ప్రజలు.. తమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి, ఈ అపూర్వ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.బుధవారం పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర భూముల్లోకి అడుగుపెట్టిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న పవిత్ర జలాలను శిరస్సున చల్లుకుని, భావోద్వేగంతో కాలువలో నిల్చుని పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. అనంతరం గోదావరి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన స్థానిక రైతులు, మహిళలు హారతులు పడుతూ, పూలు చల్లుతూ గోదారమ్మకు స్వాగతం పలికారు.ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుంది: సీఎంఅనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలతో కళకళలాడతాయి. అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో అనకాపల్లికి వచ్చిన గోదారమ్మను.. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూరీడి పాదాల వద్దకు తీసుకెళ్లి, వంశధార వరకు గోదావరి జలాలను తరలిస్తాం" అని స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 2.87 లక్షల

Yellareddypeta: భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి - నగేష్ ఈ వార్తకు సంబంధించిన

Nellore: పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు 'జై కొట్టు' నినాదం ఆవిష్కరణ నెల్లూరు: యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు సమాజంలో మార్పుకు వారిని భాగస్వాములుగా చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దుగ్గిశెట్టి సుజిబాబు అన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పరమేశ్వరి కళ్యాణ మండపంలో బుధవారం సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ యువత కోసం ‘జై కొట్టు’ అనే నినాదాన్ని ఆవిష్కరించి ప్రకటించారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం జనసేన కార్యకర్తలు, యువత నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ.. యువతలో రాజకీయ చైతన్యం తీసుకురావడంతో పాటు జనసేన పార్టీలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. ‘జై కొట్టు’ నినాదంతో యువతను పెద్ద సంఖ్యలో రాజకీయాల వైపు ఆకర్షించి, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. యువతతోనే సమాజంలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడం రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టమని సుజయ్ బాబు అన్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో యువతను సమష్టిగా ముందుకు నడిపించి వైఎస్సార్సీపీని 11 స్థానాల నుంచి ఒక్క స్థానానికి పరిమితం చేసే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం పవన్కళ్యాణ్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని సుజయ్ బాబు అన్నారు. ‘జై కొట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో యువతతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.అనంతరం భారీ కేక్ ను కట్ చేసి

Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

దిల్లీ: విశాఖ పాత విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసుల నిలిపివేతపై దాఖలైన పిల్ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఏపీ హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. పాత విమానాశ్రయం నుంచీ విమాన సర్వీసులు నడపాలని విశాఖకు చెందిన కొసరాజు గోపాలకృష్ణ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్త ఎయిర్పోర్ట్ నగరానికి 60 కి.మీ దూరంలో ఉందని, కనెక్టివిటీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. 30 ఏళ్ల పాటు సేవలు అందించిన విశాఖ విమానాశ్రయంపై ఎయిర్పోర్ట్ అథారిటీ రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. భోగాపురం విమానాశ్రయం ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’తో నిర్మించడం ఆహ్వానించదగినదని.. అలా అని 30 ఏళ్ల పాటు సేవలు అందించిన ఎయిర్పోర్టు నుంచి సర్వీసులు నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు లేవని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది

ఆళ్లగడ్డ పట్టణం: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించింది. ఈ సంఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆళ్లగడ్డకు చెందిన ఆంజనేయులు(32) పట్టణ శివారులోని సమీప పొలాల్లో మంగళవారం ఉదయం మృతిచెంది కనిపించాడు. సీఐ నాగరాజారావు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తలపై ఎవరో బండరాయితో మోది అతడిని హత్య చేసినట్లు గుర్తించారు. భార్య సుబ్బులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. భార్యపై అనుమానం రావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామానికి చెందిన గురు ప్రసాద్తో సుబ్బులుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వారి బంధానికి ఆంజనేయులు అడ్డువస్తుండడంతో సుబ్బులు భర్త హత్యకు వ్యూహరచన చేసింది. సోమవారం రాత్రి తన ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించింది. గురు ప్రసాద్ తనవెంట ప్రొద్దుటూరుకు చెందిన షరీఫ్ను వెంట తీసుకువెళ్లాడు. ముగ్గురు కలిసి పట్టణ శివారులో మద్యం సేవించారు. అనంతరం మత్తులో ఉన్న ఆంజనేయులు తలపై గురు ప్రసాద్ మద్యం సీసాతో కొట్టి, బండరాయితో మోదాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. మద్యం సీసా మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ సాయంతో పోలీసులు దానిని ఎవరు ఏ షాప్లో కొనుగోలు చేశారనేది సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. ముగ్గురిని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు

గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో పదో తరగతి విద్యార్థిని ఆచూకీ గుర్తించలేకపోయారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏముందని అభిప్రాయపడింది. ఏదైమైనా గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పోలీస్స్టేషన్కి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్ను అడ్డుకున్నారని హైకోర్టు చురకలంటించింది. ఇలాంటి పోలీసులు ఉండటం ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఘాటుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన కుమార్తె ట్యూషన్కు వెళ్లి కనిపించకుండా పోయిందని జూన్లో పట్టాభిపురం పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలు అవుతున్న తన కుమార్తె ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని హైకోర్టులో ఆమె తండ్రి హెబీయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు సరైన స్ఫూర్తితో వ్యవహరిస్తే.. బాలికను కనుగొనేందుకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించింది. రేపటి లోగా బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

ఉజ్జయిని: శ్రావణ, భాద్రపద మాసాల్లో ఉజ్జయిని మహాకాళి (Ujjain Mahakal) అమ్మవారి వార్షిక ఉత్సవాలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈసారి వేడుకల్లో అధునాతన సాంకేతికత ప్రతిబింబించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో మానవ రూపంలో ఉన్న ఓ రోబో (Humanoid Robot) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒంటికాలితో గెంతుతూ స్కూల్కు ఏడేళ్ల చిన్నారి.. ఇందౌర్కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన మానవ ఆకారంలో ఉన్న ఓ రోబోను వార్షిక ఉత్సవాలకు తీసుకొచ్చారు. అది స్థానిక రామ్ ఘాట్కు చేరుకోగానే అక్కడున్న పూజారులు దాని చేతికి కంకణం, మెడకు రుద్రాక్ష మాలతోపాటు కాషాయ కండువాను కప్పారు. దీంతో ఆ రోబో కొత్త ఆకారం సంతరించుకుంది. అంతేకాదు.. సంస్కృత మంత్రాలు పఠించిన ఆ మమరమనిషి అక్కడికి వచ్చిన భక్తులతో ముచ్చటించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన జనసైనికుడు రోళ్ల ప్రేమ్కుమార్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందడం కలచి వేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని, ర్యాలీలు, బ్యానర్ల ఏర్పాటులో స్వీయ భద్రతకు పాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రేమ్కుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని రాష్ట్ర ఫౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన జనసేన ఎమ్మెల్యేలతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి పార్టీ తరఫున రూ.5 లక్షల సాయం అందించారు. మృతుడి తండ్రి సతీష్తో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదువుతూ ఇటీవలే ఉద్యోగానికి ఎంపికైన కుమారుడు మృతి చెందడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ మృతుడి సోదరుడు ఆదినారాయణకు ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మరో ఈవెంట్ మేనేజ్మెంట్కు తెరలేపారని.. రెండున్నరేళ్ల నుంచి ఇదే తరహాలో కాలం గడుపుతూ వచ్చారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ‘‘పురుషోత్తపట్నం ద్వారా పోలవరం ఎడమ కాల్వలోకి నీళ్లు వదిలారు. పోలవరం నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు’’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు. ‘‘పోలవరం కాలువ ప్యాకేజీలను అంచనాలు పెంచి తనకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకున్నారు. పోలవరం ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. పోలవరం ఎత్తు 41 మీటర్లు కాంటూరు వద్ద నీటిని నిల్వ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలియదా?. 45 మీటర్ల నుంచి ఎత్తును 41 మీటర్లకు తగ్గించేందుకు ఎందుకు ఒప్పుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు తెచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఫోబియాతో చంద్రబాబు భయపడుతున్నారు. జగన్నామస్మరణతో చంద్రబాబు బతుకుతున్నారు. చంద్రబాబు చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ల ఖర్చుతో మరొక పోలవరం ప్రాజెక్టు కట్టవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇస్తున్నారా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇస్తున్నారా? ప్రజలకు చెప్పాలి. వైఎస్సార్ మరణించిన రోజు నీళ్లు విడుదల చేయడం దేవుడు రాసిన స్క్రిప్ట్. చేతకాని వాడు మంగళవారం అన్నారనే సామెత చందంగా ఉంది చంద్రబాబు తీరు. చంద్రబాబు పాలనలో పనులు చేయలేక ఆ నెపాన్ని ఉద్యోగుల మీద నెడుతున్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం కాలువకు నీళ్లు ఇవ్వాలి.. ఎత్తిపోతల పథకం ద్వారా కాదు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా వల్లూరులో మెగా డీఎస్సీ అక్రమాలు బట్టబయలయ్యాయి. టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్ట్ ఇచ్చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. టెట్ అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టు ఇచ్చినట్లు కర్నూలు విద్యాశాఖ అధికారులు నిర్థారించారు. స్పోర్ట్స్ కోటాలో టీచింగ్ పోస్టుకు టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధనలు ఉండగా.. అర్హత లేకుండానే ఓ అభ్యర్దిని ఎస్జీటీ పోస్టుకు శాప్ ఎంపిక చేసేసింది. కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో అర్హత లేని టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. కర్నూలు డీఈవో ఆఫీస్లో టీచర్స్ కమిటి ఆధ్వర్యంలో ప్రభాకర్ గౌడ్ విద్యార్హతలపై విచారణ జరపగా.. విచారణ కమిటీకి అర్హత సర్టిఫికెట్లను ప్రభాకర్ గౌడ్ చూపలేకపోయారు. టీచర్ కమిటీ ముందు టెట్ అర్హత పొందలేదని ప్రభాకర్ అంగీకరించారు. స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేసిన టీచర్ పోస్టులలో అనర్హులకు చోటుపై వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో కేవలం ఒక జూడో క్రీడ ద్వారానే 21 మందికి టీచర్ పోస్టులు ఇచ్చేసింది. ఘటనపై పాఠశాల డైరెక్టర్కు నివేదిక అందజేస్తామని కర్నూలు డీఈవో తెలిపారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్

Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే ఈ వార్తకు సంబంధించిన

Macherla: వైఎస్సార్ 17వ వర్ధంతి - ఘన నివాళులర్పించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వార్తకు సంబంధించిన

అనకాపల్లి పట్టణం: ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు అనకాపల్లిలో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ కార్యాలయం నుంచి జనసైనికులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలో భాగంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల దాహార్తిని తీరుస్తూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా పయనించి వచ్చిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు, స్వయంగా కాలువలోనే నిల్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న గోదారమ్మకు పుష్పాలు సమర్పించి, జలహారతి ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు. పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకున్న అనంతరం, ఉద్విగ్నభరిత వాతావరణంలో గోదావరి ప్రవాహానికి సాష్టాంగ నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.బుధవారం పాయకరావుపేటలో జరిగిన ఈ చారిత్రక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, ఎంపీలు చింతకాయల విజయ్, సీఎం రమేశ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కోలాటంతో కళాకారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన ఈ నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 23.44 టీఎంసీల గోదావరి జలాలతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక, తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఈ నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేందుకు జలవనరుల

మొన్న సాదిక్ఖాన్.. నేడు గౌస్ మోహిద్దీన్.. కాకినాడలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్ఖాన్ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్ మోహిద్దీన్ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్ఖాన్ కేసు మరువక ముందే.. గౌస్ మొహిద్దీన్ కేసు తెరపైకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకున్న తర్వాత.. మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లవ్ జిహాద్ల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో గౌస్ మొహిద్దీన్ పలువురు యువతులను మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ట్రాప్ చేసి, వారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. తనను ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేశాడని వెల్లడించింది. ఎన్నోసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తనను.. తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గౌస్ మోహిద్దీన్పై ఇప్పటికే ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడని.. ఇదే అదను భావించి తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని బాధితురాలు చెప్పింది. అయితే.. గౌస్ మొహిద్దీన్ నుంచి తనకు రక్షణ కల్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కోరినట్టు తెలిపింది. “జలం… జీవం

విజయనగరం రూరల్: వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో అధికారులు పూర్తి బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్. సేదు మాధవన్ ఆదేశించారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019ను పటిష్టంగా అమలు చేస్తూ, ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో వినియోగదారుల సమస్యలు, వాటి పరిష్కారంపై జాయింట్ కలక్టరు చాంబరులో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్లో వస్తువుల నాణ్యత, తూకాలు–కొలతలు, ధరలు, ఆహార పదార్థాల స్వచ్ఛత, ప్రజా రవాణా, విద్యుత్, టెలికాం, మున్సిపల్ సేవలు తదితర అంశాల్లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని తాకాయని, ఇది ముఖ్యమంత్రి, అపర భగీరథుడు చంద్రబాబు దార్శనికత వల్లే సాధ్యమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు చేరడం రాష్ట్ర జలవనరుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని ఆయన అభివర్ణించారు. బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు హారతి పట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నిమ్మల రామానాయుడు మాట్లాడారు.పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకముందే, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు నీరందించాలన్న చంద్రబాబు ముందుచూపు వల్లే ఈరోజు ఈ ప్రాంత ప్రజల దాహం తీరుతోందని మంత్రి అన్నారు. "2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, 2026 నాటికి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా పూర్తి చేసి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చాం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల కాలంలోనే ఏలేరు, పంప, తాండవ, శారద, వరాహ వంటి ఐదు ప్రధాన నదులను, తొమ్మిది జాతీయ రహదారులను దాటుతూ కెనాల్ నిర్మాణంలో ఉన్న క్లిష్టమైన పనులను పూర్తి చేశామని తెలిపారు. కొమ్మరిలోవ వద్ద 100 మీటర్ల లోతైన కొండను తవ్వి కాలువను తీసుకురావడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల తీవ్ర

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా పార్టీ యువజన విభాగానికి అధికారిక రూపం లభించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ పేరుతో జనసేన యువజన విభాగం లోగో, థీమ్ సాంగ్ను నాదెండ్ల మనోహర్ గ్రాండ్గా లాంచ్ చేశారు. జనసేన యువతను అత్యంత సంఘటితంగా రాజకీయంలోకి తీసుకురావడానికి ఈ విభాగం ఎంతో కీలకమని పార్టీ భావిస్తోంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కు యువతలో ఉన్న బలమైన కనెక్షన్ను ఇప్పుడు సంస్థాగత రూపంలోకి మార్చేందుకు ఈ అడుగు పడింది. కేరళలో వైద్య చికిత్స పొందుతున్న కారణంగా ఈ ముఖ్యమైన కార్యక్రమానికి స్వయంగా హాజరుకాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ఆడియో సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో ఆయన యువతకు రాజకీయ చైతన్యంతో పాటు బాధ్యతను గుర్తుచేస్తూ స్పష్టమైన పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు కేవలం నాయకులు, రాజకీయ పార్టీల కోసం జిందాబాద్ కొట్టామని, ఇకపై యువత తమ భవిష్యత్తు కోసం, సమాజంలో మార్పు కోసం జై కొట్టాలని పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. దేహి అని ఇతరుల ముందుకు చేతులు చాపకుండా దేశం కోసం సేవ చేసే చేతులు కావాలని ఆయన తన ప్రసంగంలో ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా పిఠాపురం నుంచి చిత్రాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమాంతరంగా కార్యక్రమాలు జరిగాయి. ఇదిలా ఉండగా, కొన్ని ప్రధాన కేంద్రాల్లో పవన్ కళ్యాణ్ ఆడియో సందేశాన్ని వినేందుకు ప్రత్యేకంగా లైవ్ ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ సహా ఇతర పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ వర్గాలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యువజన విభాగం ద్వారా

ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి సీఎం జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్రకు గోదారమ్మను తీసుకువచ్చామని తెలిపారు. నదులు, వాగులు, వంకలు దాటుకుని గోదారమ్మ వచ్చిందని ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణమ్మను తరలించి.. కరువు పీడిత మార్కాపురానికి నీళ్లిచ్చామని ఉద్ఘాటించారు. నల్లమల కొండలను చీల్చుకుని కృష్ణమ్మ వచ్చిందని అన్నారు. ఎన్నో సమస్యలను అధిగమించి గోదావరి జలాలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ కోసం రూ.4 వేల కోట్ల ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా మారేలా చేస్తామని తెలిపారు. ఈ జల విజయం.. ప్రజల విజయమని చెప్పుకొచ్చారు. ఆధునిక దేవాలయాలు.. సాగునీటి ప్రాజెక్టులు అని అభివర్ణించారు. నీరు ఉంటేనే భద్రత, భవిష్యత్తుపై ఓ భరోసా కల్పిస్తుందని తెలిపారు. నీరు ఉంటేనే పరిశ్రమలు.. తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టిపెట్టామని అన్నారు. 2019 నాటికి 72 శాతం పోలవరం పనులు పూర్తిచేశామని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం.. పోలవరాన్ని పర్యవేక్షించేలా మార్చామని వెల్లడించారు. 2019లో గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చిందని.. పోలవరానికి శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితులకు గొడ్డలి పార్టీ పైసా కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరానికి శాపవిముక్త కలిగిందని వ్యాఖ్యానించారు. 2028 నాటికి

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపిక! Ayodhya Ram Mandir: ఉత్తర్ప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్య శ్రీరామ మందిరానికి తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నియామకం ఖరారైంది. రామమందిర తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. భారతీయ వాయుసేనలో దాదాపు 39 ఏళ్లపాటు సుదీర్ఘంగా సేవలు అందించిన జితేంద్ర మిశ్ర, అత్యున్నత రక్షణ రంగ అనుభవాన్ని కలిగి ఉన్నారు. అయోధ్య రామాలయంలో కానుకలు మరియు విరాళాల నిర్వహణపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఈ కీలక పోస్టుకు పారదర్శకతను తీసుకువచ్చేలా నియామక ప్రక్రియను చేపట్టారు. సీఈవో పోస్టు కోసం ఎంపిక కమిటీ అత్యంత కఠినంగా వ్యవహరించి మొత్తం 5,585 దరఖాస్తులను పరిశీలించింది. ప్రాథమిక పరిశీలన అనంతరం 16 మంది అర్హులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇంటర్వ్యూల తర్వాత ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సమర్పించారు. ట్రస్ట్ పరిశీలన తర్వాత జితేంద్ర మిశ్ర నియామకం అధికారికంగా ఖరారైంది. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను

Pithapuram: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ అభయ బ్లడ్ సెంటర్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు జనసైనికులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం నాయకులు, జనసైనికులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో, సేవా భావంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్న తీరు తమకు స్ఫూర్తినిస్తోందని, ఆయన ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ ఆయన నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, కుమారపురం గ్రామ జనసైనికులు, గ్రామస్తులు, శ్రీ అభయ బ్లడ్ సెంటర్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Visakhapatnam: మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలి ఎమ్మెల్సీ రవిబాబు విశాఖపట్నం: మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆదివాసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అయోమయంలోకి నెడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. మారికవలస గురుకుల పాఠశాల పునరుద్ధరణ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఒకరోజు ఒక మాట, మరుసటి రోజు మరో మాట చెబుతూ ప్రభుత్వం ఆదివాసీ బిడ్డల భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. మారికవలస గురుకుల పాఠశాలను కాపాడేందుకు వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన మరియు పలు ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి సంఘాలు, ఆదివాసీ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వానికి స్పష్టత లేదు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులతో చర్చలు జరిపినప్పటికీ, అసలు సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు అన్నారు. జీవో నెం.69ను రద్దు చేస్తామనే హామీ ఎక్కడా రాలేదని, మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను శాశ్వతంగా యథావిధిగా కొనసాగిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదని ప్రశ్నించారు. “తల్లిదండ్రులు కోరితే వారి పిల్లలను ఇక్కడ చదివిస్తాం” అని అధికారులు చెప్పడం శాశ్వత పరిష్కారం కాదని అన్నారు. ఇప్పటికే తల్లిదండ్రుల సమావేశంలో వందలాది మంది తమ పిల్లలు మారికవలస గురుకులంలోనే చదవాలని స్పష్టంగా తీర్మానం చేసినప్పటికీ, మళ్లీ ఒక్కో తల్లిదండ్రి నుంచి వ్యక్తిగతంగా లిఖితపూర్వక లేఖలు కోరడం ఏమిటని ప్రశ్నించారు

అయోధ్య: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర (Jeetendra Mishra) ఎంపికయ్యారు. ఆయన దాదాపు 39 ఏళ్లపాటు వాయుసేనలో సేవలందించారు. సీఈవో పోస్టు కోసం ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ 5,585 దరఖాస్తులను పరిశీలించింది. 16 మందిని ఇంటర్వ్యూ చేసింది. ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేయగా.. బుధవారం సమావేశమైన ట్రస్టు సభ్యులు జితేంద్ర మిశ్ర పేరును ఖరారు చేశారు. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. కర్ణుడికీ తప్పలేదట! విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను బలోపేతం చేసేందుకు ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సీఈవో నియామకం చేపట్టింది. జితేంద్ర మిశ్ర 1986లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కు నాయకత్వం వహించారు. ఆయన పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

లక్నో: అయోద్య ట్రస్ట్ సీఈవోగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయనను అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎంపికచేస్తూ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల పాటు ఎయిర్ఫోర్స్లో సేవలందించారు. కాగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కి దరఖాస్తులను ఆహ్వనించిన సంగతి తెలిసిందే. దాదాపు 5,500కి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ జితేంద్ర మిశ్రాను సీఈఓగా ఎంపిక చేసింది. జరిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుల కమిటీ సభ్యుడు సురేష్ హవ్డేలతో కూడిన ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులను క్షుణ్ణంగా సమీక్షించి, 16 మంది అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించినట్లు ట్రస్ట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. జులై 11 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 600 మార్కుల మూల్యాంకన విధానం ద్వారా అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 3,577 మందికి ఫారాలు పంపగా, కనీసం 470 మార్కులు సాధించిన 108 మంది అర్హత పొందారు. వీరికి నాలుగు రోజుల పాటు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వారి ప్రతిభ ఆధారంగా 17 మందిని గ్రేడ్లుగా విభజించారు. చివరికి నిబద్ధత, దార్శనికత ఆధారంగా అత్యుత్తమమైన ముగ్గురిని ఎంపిక చేసి ట్రస్ట్కు సమర్పించారు. ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం, కానుకల చోరీ ఆరోపణలు, మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాల అనంతరం ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి

ఉత్తరాంధ్ర దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకాయి. ఈ చారిత్రక ఘట్టానికి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి, పవిత్ర జలాలను శిరస్సున చల్లుకున్నారు. అనంతరం నేలపై సాష్టాంగ ప్రమాణం ఆచరించి, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన క్షణాన తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఓ దశలో కాలువ నుంచి నీరు ప్రవహిస్తుంటే, చంద్రబాబు మెడలోని పచ్చ కండువా తీసి గాల్లో గిరగిరా తిప్పి తన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి మిగతా నేతలు, రైతులు కూడా తమ కండువాలను గాల్లో ఊపుతూ హర్షం వెలిబుచ్చారు.అంతకుముందు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెగ్యులేటర్ బటన్ నొక్కి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలోకి గోదావరి నీటిని విడుదల చేశారు. పాయకరావుపేట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.పోలవరం జలాల ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. తూర్పు కనుమలను తొలిచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ ఈ కాలువను నిర్మించారు. కొన్ని చోట్ల నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు నిర్మించగా, ఏలేరు నది గర్భం కింద నుంచి సైఫన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల

అమలాపురంలో విద్యుత్ షాక్తో జన సైనికుడి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రేమ్ కుమార్ మృతి కలిచివేసిందన్నారు. అమరావతి, సెప్టెంబర్ 2: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్కు గురై ప్రేమ్కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. యువకుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై జనసైనికుడు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని పవన్ అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్కే దక్కుతుంది: పట్టాభి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి రాజకీయాల్లో అధికార కూటమిలో మరోమారు వేడి రాజుకుంది. వైఎస్సార్సీపీ బహిష్కృత నేత మన్నెమాల సుకుమార్రెడ్డి కూటమిలోకి ఎంట్రీ అంశం ఇప్పుడు టీడీపీ, జనసేన వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక వైపు మన్నెమాల టీడీపీలో చేరే ప్రయత్నాలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న చర్చ.. ఇంకో వైపు మన్నెమాలను జనసేన ఇన్చార్జిగా తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే కావ్య ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం.. వెరసి కూటమి రాజకీయాలు కుతకుతలాడుతున్నాయి. కూటమిలో అంతర్గత రాజకీయాల వెనుక జనసేనను బలహీన పరిచి టీడీపీ ఆధిపత్యాన్ని మరింత పెంచుకునే వ్యూహమనే ప్రచారం ఇప్పుడు కావలి రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. మన్నెమాల ఎంట్రీకి మోకాలడ్డు? వైఎస్సార్సీపీలో కీలకంగా పని చేసిన మన్నెమాల సుకుమార్రెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేయడంతో కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్పై కావలిలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార కూటమిలోకి చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి టీడీపీలోనే అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన్నెమాలను టీడీపీలోకి తీసుకురావడంపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఆయన వర్గం సానుకూలంగా లేదు. ఈ క్రమంలో మన్నెమాల ఎంట్రీకి బీద రవిచంద్ర మోకాలడ్డినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కావలి రాజకీయాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్య నిప్పు.. ఉప్పులా ఉండగా మన్నెమాల వ్యవహారం ఆ అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన ఇన్చార్జిగా మన్నెమాల? మన్నెమాల సుకుమార్రెడ్డిని జనసేన కావలి ఇన్చార్జిగా తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే కావ్య సైతం మన్నెమాలతో మంతనాలు సాగిస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కావ్య.. రాజకీయంగా తటస్థంగా ఉన్న మన్నెమాలను నేరుగా టీడీపీలోకి తీసుకురావడంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. కర్నూలు, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. వైసీపీ ఏ రోజు ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారు.. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఏమి చేశారో చెప్పే దమ్ము ఉందా అని బీసీ జనార్దన్ రెడ్డి నిలదీశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారని తెలిపారు. పులివెందులకు కూడా నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. 36 నీటి ప్రాధాన్య ప్రాజెక్టులకు నీరు ఇస్తున్నామని వెల్లడించారు. ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డినే అని విమర్శించారు. వైసీపీ దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు.. వైసీపీ నేతలు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. ప్రజలకు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలో అధికారులతో తాము సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలకిందులు చేసిన కూడా గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీ కెనాల్కు నీరు ఎప్పుడు విడుదల

పిఠాపురం: జనసేన అధినేత పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఆడియో సందేశం ఇచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘‘చెయ్యొత్తి జై కొట్టు’ నినాదం మనందరినీ ఎంతో కదిలిస్తుంది. ఆ స్ఫూర్తిని మీకు అందించాలనే అధినేత పవన్ ఈ లోగో పెట్టారు. జై కొట్టు నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం. అరుపులు.. కేకలు కాదు.. క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అధినేత ఆదేశాలను జనసైనికులు క్రమశిక్షణతో పాటించాలి’’ అని సూచించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది

జనసేన పార్టీ యువజన విభాగానికి జై కొట్టు అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జై కొట్టు లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 2: జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. ఈరోజు(బుధవారం) కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత రెండు మూడు నెలలుగా ఆరోగ్య సమస్యల కారణంగా పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. నియంత జగన్ను ఎదుర్కొని కూటమి విజయానికి జనసేన పనిచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 48 గ్రాముల బంగారం రికవరీ కాలికి గాయంతో ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన వ్యక్తి.. కాసేపటికే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan kalyan fan dies due to electric shock in amalapuram: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసైనికులు తమ అభిమాన హీరో, డిప్యూటీ సీఎం పేరు మీదుగా పలు ఆలయాల్లో అర్చనలు, పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా పలు చోట్ల ఆస్పత్రులలో పండ్లను కూడా పంపిణి చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుడి భూజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే నేపథ్యంలో అమలాపురంలో ఫ్లెక్సీలు కడుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అమలాపురంలో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఒక యువకుడు స్పాట్ లోనే మృతిచెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ కు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అతను హైదరాబాద్ లో ఉంటూ అక్కడ ప్రైవేటు జాబ్ చేసుకుంటున్నాడు. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ప్రేమ్ కుమార్..తన స్నేహితులతో కలిసి తమ అభిమాన నేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్నాడు. స్థానికంగా ఉన్న ఒక కాలేజీ గోడ మీద ఎక్కి పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా అతనికి విద్యుత్ తీగ తగలడంతో కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో అతను స్పాట్ లోనే మృతిచెందాడు. Read more

అమరావతి: భాజపా జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా సత్యకుమార్ను నియమించింది. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 17 వరకు భాజపా, ఎన్డీయే ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమాలకు సత్యకుమార్ దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. AP Rural Drinking Water Citizen Charter 2026:గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాగునీటి సరఫరాలో సమస్యలు, పైప్లైన్ లీకేజీలు, మోటార్ల రిపేర్లు వంటి సమస్యలకు ఇక ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు “రూరల్ డ్రింకింగ్ వాటర్ సిటిజన్ ఛార్టర్ 2026 (G.O. 829)”ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ప్రజలు తమ సమస్యను అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే దానికి కంప్యూటర్ రసీదు లేదా కంప్లైంట్ నంబర్ ఇవ్వాలి. దీంతో తమ ఫిర్యాదు నమోదు అయిందా లేదా అనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉంటుంది. అలాగే సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిన్నపాటి నీటి సరఫరా సమస్యలను 24 గంటల్లోనే పరిష్కరించాలి. గ్రామాల్లో నీటి సరఫరాకు ఉపయోగించే మోటార్లలో సమస్య వస్తే దాన్ని 48 గంటల్లోపు రిపేర్ చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో మోటార్ సమస్యల కారణంగా ఎక్కువ రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. పైప్లైన్ లీకేజీల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించింది. చిన్న లీకేజీలను 24 గంటల్లో, పెద్ద లీకేజీలను 72 గంటల్లోపు సరిచేయాలి. దీనివల్ల నీటి వృథాను తగ్గించడంతో పాటు ప్రజలకు నీటి సరఫరా త్వరగా పునరుద్ధరించే అవకాశం