
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాoచందర్ రావు పిలుపునిచ్చారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని తమ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని కోరారు. ఆగస్టు 14న హైదరాబాద్ ట్యాంక్బండ్ దగ్గర పెద్ద ఎత్తున ‘తిరంగా యాత్ర’ నిర్వహిస్తున్నట్లు రామ్చందర్ రావు వెల్లడించారు. ఈ యాత్ర ఏ ఒక్క పార్టీకో, రాజకీయాలకో సంబంధించింది కాదని మన భారతదేశ ఐక్యతను, శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడానికి.. ‘వికసిత భారత్’ సంకల్పంతో చేపడుతున్న యాత్ర అని వివరించారు. హైదరాబాద్ ప్రజలందరూ కుల, మత, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి దేశం కోసం ఈ తిరంగా యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జాతీయ జెండా తన కార్యాలయంపై ఎగురవేశారు. మహబూబ్నగర్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఏర్పాటుచేసిన అనంతరం కొందరి జాతీయ జెండాలని పంపిణీ చేశారు. ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్ అనే గొప్ప నినాదంతో.. జాతీయ సమైక్యతను చాటడానికి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని.. ఈ కార్యక్రమంతో కుల, మత, ప్రాంతీయ భేదాలను