
హైదరాబాద్ మెట్రో రైల్వే వ్యవస్థలో మొదటి దశ మరియు రెండవ దశల మధ్య అనుసంధాన ప్రక్రియ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. పాత, కొత్త సాంకేతిక వ్యవస్థల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనుభవాన్ని ఈ రెండు దశల అనుసంధాన ప్రక్రియకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.మొదటి రెండో దశ మెట్రో అనుసంధానంపై ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ తో సంప్రదింపులుదీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. 2010లో మెట్రో మొదటి దశ ప్రణాళిక రూపొందించగా అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి చాలా వ్యత్యాసం వచ్చింది. మొదటిదశలో అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధునాతన వ్యవస్థలను ఏర్పాటు చేశారు అయితే అప్పుడు ఎక్కువగా విదేశీ సాంకేతికతపైన ఆధారపడ్డారు.ఏడు కారిడార్లలో నాలుగు మార్గాలు నేరుగా మొదటి దశకు కొనసాగింపుకానీ ఇప్పుడు స్వదేశంలోనే మెట్రోకి సంబంధించిన అన్ని వ్యవస్థలు తయారవుతున్న క్రమంలో, స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రధాన్యం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఇప్పటికే సేవలందిస్తున్న మొదటి దశ వ్యవస్థలతో సమర్థవంతంగా దీనిని అనుసంధానం చేయడం అత్యంత ముఖ్యమైన భాగంగా మారింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోలో ఉండవలసిన ప్రతిపాదించిన ఏడు కారిడార్లలో నాలుగు మార్గాలు నేరుగా మొదటి దశకు కొనసాగింపుగా ఉంటాయి.పాత కొత్తలను కలిపి చేసే కొనసాగింపులో అనుసంధానం కీలకంఎంజీబీఎస్, చంద్రాయణ గుట్ట, ఎల్బీనగర్ - హయత్ నగర్, మియాపూర్- పటాన్చెరు, రాయదుర్గం - కోకాపేట నియో పోలీస్ మార్గాలు ఇప్పటికే ఉన్న మెట్రో నెట్వర్క్ తో కలవాల్సి ఉంది. దీనివల్ల ప్రయాణికులు కూడా ఒక దశ నుంచి మరొక దశకు మారే సమయంలో రైలు కార్యకలాపాలు, సిగ్నలింగ్ ,విద్యుత్, కమ్యూనికేషన్














.webp)
.webp)


