సక్సెస్ ట్రాక్ ఎక్కిన నలుగురు మెగా’ హీరోలు.. ఇక మిగిలింది ఆ ఇద్దరే
Actor ProfileActor

సక్సెస్ ట్రాక్ ఎక్కిన నలుగురు మెగా’ హీరోలు.. ఇక మిగిలింది ఆ ఇద్దరే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సక్సెస్ ట్రాక్ ఎక్కిన నలుగురు మెగా’ హీరోలు.. ఇక మిగిలింది ఆ ఇద్దరే
Samayam Telugu4 Dec 2026
సక్సెస్ ట్రాక్ ఎక్కిన నలుగురు మెగా’ హీరోలు.. ఇక మిగిలింది ఆ ఇద్దరే

గతేడాది దసరా పండగ ముందు వరకూ మెగా హీరోల బాక్సాఫీస్ పరిస్థితి ఏమంత బాగాలేదనే చెప్పాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వరకూ.. అందరికీ వరుస ఫ్లాపులు పడ్డాయి. మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే విజయదశమి తర్వాత మెగా ఫ్యామిలీ దశ దిశ మారింది. అప్పటి నుంచి మెగా హీరోల నుంచి వస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నాయా లేదా అనేది పక్కన పెడితే.. మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా చేశాయి.పవన్ కళ్యాణ్ OG సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు అందుకున్నారు. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని దక్కించుకున్నారు. ప్రాంతీయ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ‘పెద్ది’ చిత్రంతో రామ్ చరణ్ కూడా భారీ వసూళ్లు సాధించారు. ఇప్పుడు లేటెస్టుగా వరుణ్ తేజ్ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కారు. చాలా ఏళ్లుగా హిట్టు కోసం కష్టపడుతున్న వరుణ్.. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ఎట్టకేలకు మంచి సక్సెస్ సాధించారు. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టారు.ఇలా నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. ఇక మిగిలింది ఇద్దరు మెగా మేనల్లుళ్లు మాత్రమే. సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద సక్సెస్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన 'బ్రో' సినిమా నిరాశపరిచింది. ఆ మూవీ వచ్చి మూడేళ్లు అవుతోంది. తేజ్ ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. లాస్ట్ ఇయర్ దసరాకే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈసారి