
అమరావతి: విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకున్న నిబంధనలపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారణ జరపాలని, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మాత్రమే జైలు నుంచి తీసుకురావాలని హైకోర్టు ఆదేశించింది. జైలుకు వెళ్లి, మళ్లీ వచ్చేవరకు ప్రతి క్షణం ఆడియో, వీడియో రికార్డు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు విచారణ పురోగతిపై ప్రభావం చూపుతాయని రాష్ర్టప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. 8 రోజులు కస్టడీకి ఇచ్చినా విచారణలో జాప్యానికే అవకాశం ఉంటుందని తెలిపింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శుక్రవారం రాత్రి తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దొరసాని మండపం వద్ద చిరుత సంచరించినట్లు భక్తులు భయపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి