సోమాలియా తీరంలో నౌక హైజాక్.. ఆరుగురు భారతీయ నావికులతో వెళ్తుండగా అపహరించిన సముద్రపు దొంగలు
Actor ProfilePolitician

సోమాలియా తీరంలో నౌక హైజాక్.. ఆరుగురు భారతీయ నావికులతో వెళ్తుండగా అపహరించిన సముద్రపు దొంగలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సోమాలియా తీరంలో నౌక హైజాక్.. ఆరుగురు భారతీయ నావికులతో వెళ్తుండగా అపహరించిన సముద్రపు దొంగలు
Samayam Telugu25 Jan 2027
సోమాలియా తీరంలో నౌక హైజాక్.. ఆరుగురు భారతీయ నావికులతో వెళ్తుండగా అపహరించిన సముద్రపు దొంగలు

Ship Hijacked Off Somalia Coast : సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ ప్రాంత తీరప్రాంతంలో సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న 'లుటుఫ్' అనే వాణిజ్య కార్గో నౌకను అపహరించి, తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా.. వారిలో ఆరుగురు భారతీయ నావికులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలార్ మూవ్‌మెంట్ షిప్పింగ్ సంస్థకు చెందిన ఈ నౌకలో ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలు రవాణా అవుతున్నాయి. సోమాలియాలోని మొగదిషులో ఉన్న టర్కీ సైనిక శిక్షణ కేంద్రానికి ఈ ఆయుధ సామాగ్రిని చేరవేసే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వారంలో పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఈల్ జిల్లా, మర్రాయ ప్రాంతానికి దాదాపు మూడున్నర నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దొంగలు దాడి చేసి నౌకను తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ నౌకను నుగాల్ తీరప్రాంతంలోని దంగోరోయో జిల్లా గర్మాల్ సమీపానికి తరలించారు.వివిధ దేశాలకు చెందిన సిబ్బంది బందీ..హైజాక్‌కు గురైన ఈ నౌకలో ఆరుగురు భారతీయ సముద్ర నావికులతో పాటుగా ఒక టర్కీ పౌరుడు, ఒక జార్జియా పౌరుడు భద్రత కోసం నియమించబడిన ఇద్దరు సెర్బియా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. గత ఏప్రిల్ 26వ తేదీన 'స్వార్డ్' అనే మరొక వ్యాపార నౌకను హైజాక్ చేసిన ఎనిమిది మంది సభ్యుల పైరేట్స్ బృందమే ఈ దాడులకు పాల్పడి ఉంటుందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ భయాందోళనకర ఘటనపై భారత ప్రభుత్వం గానీ టర్కీ అధికార వర్గాలు గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.నౌక అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. టర్కీకి చెందిన రెండు నౌకలు ఈ హైజాక్ అయిన నౌకను సమీపించగా.. టర్కీ హెలికాప్టర్లు, డ్రోన్లు గాల్లోకి లేచి ఆ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాయి