
ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి మీడియా సమావేశంలో కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 76 పరుగులకే కుప్పకూలడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా 2026 టీ20 ప్రపంచకప్లో హీరోగా నిలిచిన సంజూ శాంసన్ను తుది జట్టు నుంచి తప్పించడంపై పెను దుమారం రేగింది. ఈ విషయంపై గంభీర్ స్పందిస్తూ, సంజూతో తనకు పూర్తి స్పష్టత ఉందని, అయితే వారి మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టలేనని స్పష్టం చేశాడు.ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్తో సిరీస్లోని తొలి మ్యాచ్లోనూ విఫలమైన సంజూ శాంసన్ స్థానంలో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. అయితే, వైభవ్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. అయినప్పటికీ, సంజూకు జట్టులో అతని పాత్రపై పూర్తి స్పష్టత ఇచ్చానని గంభీర్ భరోసా ఇచ్చాడు.మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. "సంజూ శాంసన్కు ఎలాంటి స్పష్టత కావాలో, అది నా వైపు నుంచి ఇచ్చాను. అది పూర్తిగా హెడ్ కోచ్, ఆటగాడి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ. ఆ విషయం బయటకు రాదు" అని ఖరాఖండిగా తెలిపాడు. "సంజూ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. అతను భారత్ కోసం అద్భుతాలు చేశాడు. కానీ కొన్నిసార్లు ఆటగాడి ప్రస్తుత ఫామ్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిరీస్లోనే అతను తిరిగి జట్టులోకి రాలేడనే కఠిన నిబంధన ఏమీ లేదు" అని