
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవ్గణ్ (Ajay Devgn), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలాను ఓ ప్రకటన ద్వారా వీరు పరోక్షంగా ప్రచారం చేసినందుకు ఈ చర్యలు చేపట్టింది. అందులో తమ భాగస్వామ్యాన్ని తక్షణమే నిలిపివేయాలని.. అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ ప్రచార కంటెంట్లను తొలగించాలని నటులను ఆదేశించింది. వారి ప్రచార ఒప్పందాలు, చెల్లింపులు వంటి వివరాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ నోటీసులను ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారామ్ ముంఢే (Tukaram Mundhe) జారీ చేయగా.. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ యాడ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా.. పరోక్షంగా వారిని పాన్ మసాలా వైపు ప్రోత్సహిస్తోందన్నారు. గతంలో ఈ యాడ్లో షారుక్ ఖాన్, అజయ్ దేవ్గణ్లతో పాటు అక్షయ్ కుమార్ నటించారు. అయితే పొగాకు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రకటన ఉందని అభిమానుల నుంచి విమర్శలు రావడంతో దాని నుంచి అక్షయ్కుమార్ వైదొలిగారు. ఇదీ చదవండి: ఈ దూకుడు.. సాటెవ్వరు! గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

