
ప్రధాని నరేంద్ర మోదీని దేవుడిగా చిత్రీకరిస్తూ ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన 'మోదీ చాలీసా' కార్యక్రమం పెను దుమారం రేపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్ రాష్ట్ర ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన భారీ కటౌట్ను దేవుడి రూపంలో నిలబెట్టి, 'జై జై మోదీ, హర్ హర్ మోదీ' అంటూ నినాదాలు చేస్తూ హారతులు ఇచ్చారు.ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో 'ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా' (పీసీఐ) వెంటనే స్పందించి వివరణ ఇచ్చింది. ఈ కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం నిర్వాహకులు హాల్ను అద్దెకు తీసుకున్నారని, కానీ వారు నిబంధనలను ఉల్లంఘించి మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించారని పీసీఐ 'ఎక్స్' వేదికగా తెలిపింది. విషయం తెలియగానే తమ అధికారులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారని పేర్కొంది.అయితే, ఈ కార్యక్రమాన్ని బీహార్ ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు వైస్-ప్రెసిడెంట్ రాజన్ సింగ్ గట్టిగా సమర్థించుకున్నారు. మోదీ ప్రభుత్వం వల్లే తమ కమ్యూనిటీకి తొలిసారిగా హక్కులు, ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన అన్నారు. అందుకే తాము ఆయన్ను దైవంగా భావిస్తున్నామని తెలిపారు. కేవలం చాలీసా పఠించడమే కాదని, బీహార్లో ఐదు ఎకరాల స్థలంలో రూ.112 కోట్ల వ్యయంతో "శ్రీ నరేంద్ర మోదీ భగవానుడికి" ఆలయాన్ని నిర్మించాలని కూడా తాము ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన సంచలన