
Shreyas Iyer Captaincy: ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ట్రెండ్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాల్సిన పిచ్పై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం భారత జట్టు కొంపముంచగా, అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. టాస్ నిర్ణయమే కొంపముంచింది.. కెప్టెన్ వ్యూహం ఫ్లాప్! టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు సాధించడానికి అనుకూలమైన ట్రెండ్ బ్రిడ్జ్ పిచ్పై, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పిచ్ స్వభావాన్ని అంచనా వేయడంలో టీమిండియా మేనేజ్మెంట్ చేసిన ఈ అతిపెద్ద తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, ఆఖర్లో సామ్ కరన్, విల్ జాక్స్ వేగంగా పరుగులు రాబట్టారు. భారత బౌలర్లు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేక చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరును నమోదు చేయగలిగింది. ఇది కూడా చదవండి: టాస్లో హీరో.. మ్యాచ్లో జీరో.. టీమిండియా పాలిట విలన్లా మారిన శ్రేయాస్ అయ్యర్..! పేకమేడలా కూలిన భారత బ్యాటింగ్.. రికార్డు స్థాయిలో ఘోర అవమానం.. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటింగ్ను ముక్కలు చేశారు. కేవలం పవర్ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా తీవ్ర కష్టాల్లో పడింది. పవర్ప్లేలో భారత్ ఇన్ని వికెట్లు కోల్పోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. అభిషేక్ శర్మ, వైభవ్ ఆశలు రేపినా ఆ ఆనందం ఎంతో సేపు