
ఇడ్లీ, దోస, వడలతో పాటు వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తినే కారం పొడికి తెలుగు వంటకాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా కందిపప్పు, మినపప్పు వంటి పప్పులతో కారం పొడి తయారు చేస్తారు. అయితే పప్పులు లేకుండానే కొన్ని పదార్థాలతో కమ్మని ఆంధ్రా స్టైల్ కారం పొడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. పత్యం పాటించే వారు కూడా తమ ఆహార నియమాలకు అనుగుణంగా దీనిని తీసుకోవచ్చు. ఈ కారం పొడి తయారీకి 50 గ్రాముల గుంటూరు ఎండుమిరపకాయలు, 30 గ్రాముల ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ, ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు, పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్ల నూనె అవసరం. ముందుగా మిరపకాయలను వేయించాలి: గుంటూరు ఎండుమిరపకాయలను శుభ్రంగా తుడిచి మధ్యలోకి తుంచుకోవాలి. మందపాటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మిరపకాయలను వేసి చిన్న మంటపై కలుపుతూ దోరగా వేయించాలి. మిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించడం ముఖ్యం. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించాలి: అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి ముందుగా ధనియాలను చిన్న మంటపై వేయించాలి. అవి సగం వేగిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసి సన్నటి మంటపై దోరగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. కారం పొడిగా గ్రైండ్ చేయాలి: వేయించిన మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో పసుపు, ఇంగువ, కల్లుప్పు లేదా తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. పొడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా చేసుకుంటే రుచి బాగుంటుంది. సాధారణంగా