వరి బోనస్ చెల్లింపులు ఇక వీరికే
Actor ProfilePolitician

వరి బోనస్ చెల్లింపులు ఇక వీరికే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వరి బోనస్ చెల్లింపులు ఇక వీరికే - కీలక మార్పులు
Oneindia Telugu28 Dec 2026
వరి బోనస్ చెల్లింపులు ఇక వీరికే - కీలక మార్పులు

రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సన్న వడ్ల బోనస్ పథకంలో కీలక మార్పులు చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన సన్న బియ్యం రకాలను సాగు చేసినవారికి మద్దతు ధరలతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రైతులు పండించిన సన్న రకం వడ్లకు మార్కెట్ ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తున్నారు. డబ్బును నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే, ఇక నుంచి తాజా మార్పుల మేరకు కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.తెలంగాణ వ్యవసాయ శాఖ రైతులకు కీలక సమాచారం అందించింది. ప్రభుత్వం రైతులు విక్రయించిన సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేస్తోంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం వేస్తోంది. అయితే ఈ బోనస్ అందించేందుకు పలు విధివిధానాలు మార్చింది. ఇక నుంచి ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్న రకం విత్తనాలు వేసి పండించిన రైతులకు మాత్రం బోనస్ అందుతుంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 7 ప్రత్యేక రకాల సన్న వరి విత్తనాలను వేసి పండించిన రైతులకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ సొమ్ము అందుతుంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే రైతులు కొనుగోలు చేసే విత్తనాల రికార్డులు ఆన్‌లైన్‌లో కచ్చితంగా నమోదు చేయటం కోసం ప్రత్యేక ఆన్‌లైన్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!ఇక ఈ రకాలకే బోనస్ చెల్లింపుఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు ఈ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. కాగా, ఇక నుంచి ప్రభుత్వ అనుమతి పొందిన విత్తన డీలర్లు తాము రైతులకు విక్రయించే ప్రతి సన్న వరి విత్తన రకం వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు