
ఎర్రకోట వద్ద పటిష్ఠ భధ్రత.. వందేమాతరం గీతాలాపన తర్వాత సభా ప్రాంగణంలో వాయు సేన విమానాలతో పూల వర్షం.. పంద్రాగస్టు వేడుకలు హాజరైన కేంద్ర మంత్రులు, విద్యార్ధులు, వివిధ రంగల ప్రముఖులు.. అలరిస్తున్న విద్యార్ధులు, సైనిక దళాల కవాతు.. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా వందనం ముందు వందేమాతరం గీతాలాపన..మరికాసేట్లో ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండాను ఎగరేయనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటకు వెళ్లేముందు రాజ్ ఘాట్ను సందర్శించిన ప్రధాని మోడీ.. కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Independence Day 2026 Live Updates: దేశ వ్యాప్తంగా ప్రజలు 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. 1947లో బ్రిటిష్ పాలనకు విముక్తిగా ప్రతి యేడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై మువ్వెన్నల జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. ఇక భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా 13వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ భారత ప్రధాని ఎర్రకోట నుంచి ఎలాంటి సందేశం ఇస్తారనేది దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి దేశ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా