విశాఖ తీరంలో భూకంపం.. రిక్టర్ స్కేలు
Actor ProfilePolitician

విశాఖ తీరంలో భూకంపం.. రిక్టర్ స్కేలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశాఖ తీరంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో వణకిన నగరం
Zee Telugu30 Oct 2026
విశాఖ తీరంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో వణకిన నగరం

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Earthquake In Visakhapatnam: ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, బంగాళాఖాతంలో సుమారు పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రకంపనాల ప్రభావం వల్ల విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు సమాచారం. నగరంలోని అనేక చోట్ల కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు గమనించారు. ముఖ్యంగా ఉదయం సుమారు 5 గంటల సమయంలో, బంగాళాఖాతంలోని పది కిలోమీటర్ల లోతులో 4.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రభావం కేవలం విశాఖపట్నానికే పరిమితం కాకుండా వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కూడా భూప్రకంపనలు సంభవించినట్లు గుర్తించారు. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో పలుమార్లు భూకంపాలు సంభవించిన చరిత్ర ఉంది. ఉదాహరణకు, గత ఏడాది నవంబర్ 4వ తేదీన కూడా తెల్లవారుజాము సమయంలో ఇలాగే భూమి కంపించింది. ఈరోజు విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీ, పెదవాల్తేరు, గాజువాక ప్రాంతాల్లో సుమారు 47 సెకన్ల పాటు భూమి కంపించింది, ఇది రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదైంది. అంతేకాకుండా, ఉత్తరాంధ్ర నుంచి జైపూర్, అస్సాం వంటి ప్రాంతాల్లో కూడా శనివారం అర్ధరాత్రి సమయంలో భూమి ప్రకంపించినట్లు సమాచారం ఉంది. సాధారణంగా భూమి అడుగు భాగాన జరిగే భౌగోళిక మార్పులు, భూమి లోపల జరుగుతున్న పరిణామాల వల్ల ఇలాంటి భూకంపాలు సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతారు. విశాఖ తీరానికి సమీపంలో ఉన్న బంగాళాఖాతంలో నాటికల్ మైల్స్ దూరంలో పది కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈరోజు సంభవించిన ఈ స్వల్ప భూకంపం కారణంగా ప్రజలు తీవ్రమైన ఆందోళనకు