వారికి లక్షరూపాయల ఆర్ధిక అండ.. అప్లై చేసుకోమంటున్న తెలంగాణా సర్కార్
Actor ProfileCelebrity

వారికి లక్షరూపాయల ఆర్ధిక అండ.. అప్లై చేసుకోమంటున్న తెలంగాణా సర్కార్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారికి లక్షరూపాయల ఆర్ధిక అండ.. అప్లై చేసుకోమంటున్న తెలంగాణా సర్కార్
Oneindia Telugu1 Nov 2026
వారికి లక్షరూపాయల ఆర్ధిక అండ.. అప్లై చేసుకోమంటున్న తెలంగాణా సర్కార్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి సంబంధించి సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి శుభవార్త. సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.సివిల్స్ మెయిన్స్ రాసేవారికి గుడ్ న్యూస్ రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇచ్చే నిధుల ద్వారా ఈ సంవత్సరం ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్టు సింగరేణి సంస్థ వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా upsc సివిల్ సర్వీసెస్ పరీక్షలో క్వాలిఫై అయ్యి, మెయిన్స్ రాయబోయే ప్రతి అర్హుడైన తెలంగాణ అభ్యర్థికి లక్ష రూపాయల ఆర్థిక ప్రోత్సాహకం అందుతుంది.సివిల్స్ రాసేవారి ఆర్ధిక భారం తగ్గించే ప్లాన్దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్థానిక అభ్యర్థులకు కోచింగ్ స్టడీ మెటీరియల్స్ కోసం అయ్యే ఆర్థిక భారాన్ని తగ్గించడం లో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులు ఈ ఏడాది జరిగిన upsc ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రతి అభ్యర్థి తెలంగాణకు చెందిన వారై ఉండాలి. దరఖాస్తులు ఆన్ లైన్ లోనే.. రెండేళ్లలో 346 మంది అభ్యర్థులకు లబ్ధిదీని కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తులు స్కూటీని ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఖాతాలలో నేరుగా నగదు జమ చేయబడుతుంది. ఇప్పటివరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చొరవతో 2024లో ప్రారంభమైన ఈ పథకం గత రెండేళ్ల కాలంలో దాదాపు 346 మంది అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది.రేషన్ బియ్యానికి బదులు రాళ్ళ తూకం వేస్తున్న గ్రామాలు!మరిన్ని వివరాలకు సింగరేణి అఫీషియల్ వైబ్ సైట్ లో చూడండి వీరిలో చాలామంది