
Eenadu•22 Dec 2026
విద్యను ఉపాధికి అనుసంధానం చేస్తున్నాంవిద్యను ఉపాధి రంగానికి అనుసంధానం చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ జెండా వందనం అనంతరం మాట్లాడారు. రాజధాని అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించిందని, అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి లాంటిదని అన్నారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, అన్నిరంగాల్లో ఏపీని ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నామని లోకేశ్ వివరించారు. విద్యను ఉపాధికి అనుసంధానం చేస్తున్నాం : మంత్రి లోకేశ్