విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్యల
Actor ProfilePolitician

విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్యల

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్యలపై చర్చకు సిద్ధం
Andhra Jyothy27 Nov 2026
విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్యలపై చర్చకు సిద్ధం

ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసు చర్యలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధమేనని తెలిపారు. న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసు చర్యలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధమేనని ఆయన ఇవాళ (సోమవారం) తెలిపారు. అయితే, సభా కార్యక్రమాలను అడ్డుకునేలా విపక్షాలు హంగామా చేయకూడదని స్పష్టం చేశారు. ‘విద్యార్థుల ఉద్యమం, దానికి సంబంధించిన పరిణామాలపై పూర్తి స్థాయి, సవివరమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే చర్చ జరుగుతున్నప్పుడు, హోంమంత్రి లేదా ప్రభుత్వం సమాధానం ఇస్తున్న సమయంలో విపక్షాలు సభలో అంతరాయం కలిగించకూడదు. హోంమంత్రి ఇచ్చే సమాధానాన్ని వారు వినాలి’ అని రిజిజు పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనల సందర్భంగా ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బిహార్‌లోని సివాన్‌లో ఏకే-47 వినియోగంపై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని విపక్షాలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఓ జాతీయ పత్రికలో రాసిన వ్యాసం నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై హోంమంత్రి అమిత్ షా ఇప్పటివరకు ఎలాంటి విచారణకు ఆదేశించలేదని, కనీసం ప్రకటన కూడా చేయలేదని ఆ వ్యాసంలో రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులపై జరిగిన దాడిని హోంమంత్రి సమర్థిస్తున్నారనే విషయాన్ని ఆయన మౌనం స్పష్టం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలు ప్రతిరోజూ నోటీసులు ఇస్తున్నప్పటికీ వాటిని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన

హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్
Oneindia Telugu20 Jun 2026
హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్

ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న లాకప్ డెత్ లు, ఇందులో పోలీసుల ప్రమేయం నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఇవాళ ఓ సంచలన ట్వీట్ చేశారు. హలో ఇండియా!!! చట్ట పాలన స్థానంలో భయానక పాలన