
ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలతో ఝార్ఖండ్ ప్రభుత్వం దిగొచ్చింది. ముగ్గురు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కోణాన్ని 'సీఐడీ','ఈడీ' విచారణకు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. రాంచీ (జార్ఖండ్), ఆగస్టు 9: జేపీఎస్సీ (JPSC), జేఎస్ఎస్సీ (JSSC) ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆమోదించగా, ఆందోళనకారుల డిమాండ్లపై సీఐడీ (CID), ఈడీ (ED) విచారణలకు ప్రభుత్వం అంగీకరించింది. సభ్యుల రాజీనామాల ఆమోదం: జేపీఎస్సీ సభ్యులు అజితా భట్టాచార్య, అనిమా హన్స్ దా, జమాల్ అహ్మద్ల రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్ ఆమోదించారు. సీఐడీ, ఈడీ విచారణ: 14వ జేపీఎస్సీ, బ్యాలెన్స్ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాల నేరపూరిత కోణాన్ని 'సీఐడీ' విచారిస్తుంది. అక్రమ ఆర్థిక లావాదేవీలు ఉన్నందున 'ఈడీ' (Enforcement Directorate) విచారణకు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. 90 రోజుల్లో ఛార్జ్షీట్: విచారణ అనంతరం దోషులపై 90 రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సుదివ్య కుమార్ సోను తెలిపారు. నియామక సంస్కరణల కమిటీ: భవిష్యత్తు నియామకాల్లో పారదర్శకత కోసం IIT-ISM, IIM రాంచీ, XLRI నిపుణులతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. 2019 తర్వాత నిర్వహించిన JSSC CGL పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేయగా, ప్రభుత్వం దానిని నిరాకరించింది. ఈ పరీక్ష హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జరిగిందని, ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాల్లో ఉన్నందున ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదని మంత్రి వివరించారు. విద్యార్థులు కోరిన 98శాతం డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని