Jangaon Congress Councillor Arrest : జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్.. కామాంధుడిగా మారి అర్ధరాత్రి వేళ ఓ వృద్ధురాలిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘోర ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వృద్ధురాలి సమయస్ఫూర్తి, స్థానికుల అప్రమత్తతతో సదరు కౌన్సిలర్ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆయన్ను బాత్రూంలో బంధించిన స్థానికులు.. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇట్లోకి చొరబడి.. వృద్ధురాలి అరుపులతో గుట్టురట్టు!పోలీసులు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. చాగల్లు గ్రామానికి చెందిన 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చౌదరపల్లి సంపత్ రాజ్ సోమవారం రాత్రి ఓ ఘోర అన్యాయానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. సంపత్ రాజ్ ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న సదరు వృద్ధురాలిపై ఒక్కసారిగా లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ ఊహించని పరిణామంతో షాక్కు గురైన వృద్ధురాలు ఏమాత్రం అధైర్యపడకుండా గట్టిగా కేకలు పెట్టడం ప్రారంభించింది. అర్ధరాత్రి వేళ వృద్ధురాలి గది నుంచి వస్తున్న ఆర్తనాదాలు, అరుపులు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా ఆమె ఇంటి వైపు పరుగున వచ్చారు.ఇదీ చూడండి: ఖమ్మం బాలిక అత్యాచారయత్నం కేసు.. బాధితురాలికి పోలీస్ కమిషనర్ పరామర్శబాత్రూమ్లోకి జంప్.. బయట నుండి లాక్ చేసిన జనం!ఇంటి చుట్టూ జనం భారీగా గుమిగూడటం గమనించిన కౌన్సిలర్ సంపత్ రాజ్ ఒక్కసారిగా హడలిపోయాడు. వారి నుంచి తప్పించుకునే మార్గం లేక.. కంగారులో అదే ఇంట్లోని బాత్రూమ్లోకి దూరి తలుపులు వేసుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు అతడిని బయటకు రానివ్వకుండా బాత్రూమ్ తలుపులకు బయట నుంచి తాళం వేశారు. ఆపై వెంటనే 'డయల్ 100'

తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల బామ్మ నవనీతమ్మ (Navaneethamma)కు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం లభించింది. టీటీడీ అధికారులు బామ్మతో పాటుగా కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేసి దగ్గరుండి దర్శనం

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల పవిత్ర క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. సాధారణంగా భక్తులు తిరుమలేశుని దర్శనం చేసుకోవడానికి గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో వేచి

తిరుమల వేంకటేశ్వర స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోనిదే వారు ఉండలేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి ఏటా దర్శనం చేసుకోవాల్సిందే. అయితే 116 ఏళ్ల

శ్రీనివాసుని స్వామి పిలుపు రావాలంటే అదృష్టం ఉండాలి.. ఏడు కొండలు ఎక్కాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. వయసు మళ్లిన వారు సైతం స్వామి దర్శన భాగ్యం కోసం పరితపిస్తుంటారు. అది ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ

లిఫ్ట్లో తలెత్తిన సాంకేతిక సమస్య ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. లిఫ్ట్ రాకుండానే డోర్ తెరుచుకోవడంతో ముందుకు అడుగు వేసిన వృద్ధురాలు అమాంతం కిందపడిపోయారు. దాని కింద నలిగి ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ

మృతదేహాన్ని మోసేందుకు నలుగురు మనుషులు, తరలించేందుకు వాహనం దొరకక.. చివరికి మనవడు, కుమార్తె కలిసి వృద్ధురాలి శవాన్ని సైకిల్పై శ్మశానానికి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బరగఢ్

అమెరికాలోని టెక్సాస్లో ఆధునిక టెక్నాలజీ విషాదాన్ని మిగిల్చింది. ఆటోమేటెడ్ మోడ్లో ఉన్న టెస్లా కారు ఒకటి అదుపుతప్పి నివాస గృహంలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక

హైదరాబాద్: మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా భద్రత, బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ‘‘సాక్షి’’ తెలుగు దినపత్రికలో జూన్ 20న ప్రచురితమైన 2 వార్తలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు (జ్యుడీషియల్)