
కోలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యారు హీరో విశాల్. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, పర్సనల్ విషయాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నా్రు. అలాగే ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ ను కలిసిన తన అనుభవం వెల్లడించారు. “నేను ఇటీవల విజయ్ని కలిసినప్పుడు కూడా అతను అలాగే ఉన్నాడు. నేను ఎలాంటి బోకే తీసుకెళ్లలేదు. ఎందుకంటే నేను సాధారణంగా బోకేస్ కొనను. అతను అలాగే ఉన్నాడు, కేవలం పోస్టింగ్ మాత్రమే మారింది” అంటూ చెప్పుకొచ్చారు విశాల్. చాలా మంది నటీనటులకు రాజకీయాల్లో లభించనప్పటికీ, తమిళనాడులో తలపతి విజయ్ రెండేళ్లలో విజయం సాధించగలరన్న అంచనాలున్న నేపథ్యంలో, నటులను తమిళ ప్రజలు పాలనలో ఎందుకు విశ్వసిస్తారనే ప్రశ్నకు విశాల్ సమాధానమిచ్చారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. నిజానికి, ఇది కేవలం నటుల పట్ల విశ్వాసం కాదని, అపారమైన ప్రజాదరణ కలిగిన నటుల పట్ల మాత్రమేనని విశాల్ స్పష్టం చేశారు. విజయ్ విషయంలో ప్రజలు తమ నమ్మకాన్ని ఉంచడానికి ఆయన కేవలం నటుడు కాబట్టి కాదు. ప్రజలు తీవ్రమైన మార్పును కోరుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రజలతో బలమైన అనుసంధానం (కనెక్టివిటీ) అనేది ఒక ముఖ్యమైన అంశమని వెల్లడించారు. ఈ కారణాల వల్ల, మొదటిసారి ఓటర్లు, ఇతర ప్రజలు మార్పు కోసం విజయ్ వైపు మొగ్గు చూపారని విశాల్ వివరించారు. ఇప్పుడు ఆయన ఎలా పని చేస్తారు అనేది చూడాలి, అదే అత్యంత ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చారు. ఇది కేవలం నటనకు మించి, ప్రజలతో నిజమైన అనుసంధానం, బాధ్యత గురించి అని అన్నారు. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న