
ఇచ్ఛాపురం: డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతూ.. నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైన వైకాపా నాయకులకు బ్రేకులు పడ్డాయి. ముందస్తు అనుమతి లేకుండా బైక్ ర్యాలీని అనుమతించేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. సోంపేట సీఐ ఆధ్వర్యంలో పలువురు ఎస్సైలు, పోలీస్ బలగాలు వైకాపా కార్యాలయం వద్ద మోహరించడంతో నాయకులు వెనక్కుతగ్గారు. జడ్పీసీపీ పిరియా విజయ, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు