
మన దేశంలో - సహజంగానే - కులవ్యవస్థ వ్యాప్తికీ, కొనసాగింపుకీ లిఖిత సంప్రదాయం ఉపకరించింది. 'విధిరాత'కి సర్వత్రా విధేయత లభించింది. మన దేశంలో - సహజంగానే - కులవ్యవస్థ వ్యాప్తికీ, కొనసాగింపుకీ లిఖిత సంప్రదాయం ఉపకరించింది. 'విధిరాత'కి సర్వత్రా విధేయత లభించింది. అర్ధం కానిదల్లా 'బ్రహ్మలిపి' అయింది. అయితే ఇది కొద్దిరోజుల్లో కొంతమంది ఒక చోట గుమిగూడి చేసిన కుట్ర కాదు; శతాబ్దాలపాటు క్రమేపీ దేశమంతటా వ్యాపించిన భావజాలం. మాట్లాడే జంతువు మనిషి మాత్రమే. సుమారు లక్ష సంవత్సరాల క్రిందట భాషకు మౌలిక రూపాలు ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞుల అంచనా. ఆదిమ మానవులు గుంపులుగా వేటాడేటప్పుడు, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, జంతువు జాడను తెలియపరచుకుంటూ ముందుకి సాగిన కాలంలో శబ్దాలు, అనుకరణలు, మాటలు అవసరమయ్యాయి. వేట ముగిసాక, రాత్రిపూట మంట చుట్టూ చేరి, మాంసం తింటూ, ఆ రోజున జరిగిన సాహసాల్ని పిల్లలకు వివరించినప్పుడు కథలు పుట్టి ఉండవచ్చు. మాటలు, పాటలయ్యాయి; పాటకి నృత్యం తోడైంది. సాహిత్యం, సంగీతం, భాషతోనే వికసించాయి. భాష అనే ఉమ్మడి సాధనమే మానవ సమూహాల తొలి అస్తిత్వ ప్రకటన. లిపి తరవాతెప్పుడో (సుమారు క్రీ.పూ.3000) పుట్టింది. తిండిని పోగు చేసుకుంటూనో, వేటాడుతూనో, లేదా పశుపోషకులుగానో జీవించిన తెగలకు లిపి అవసరం లేదు. నదీ తీరాలలో స్థిర వ్యవసాయం మొదలై, పట్టణాలు వెల్లివిరిసాక – నాగరికులకు ఎన్నో వస్తువులు, దినుసులు, వస్త్రాలు, మద్యం, వగైరాలు అవసరమ య్యాయి. అదనపు ఫలసాయం, వస్తు మార్పిడి, ఇతర ప్రాంతాలలో దొరికే వస్తువులను సంపాదించుకోవడానికి తోడ్పడ్డాయి. డబ్బు వాడుకలోకి వచ్చాక, దూర దేశాలతో వ్యాపారం సుగమం అయింది. నౌకా రవాణా వృద్ధి చెంది, రేవులు నగరాలయ్యాయి. ఈ క్రమంలోనే లిపి అవసరమైంది. సింధునదీ ప్రాంతంతో సహా అన్ని ప్రాచీన నాగరికతలలోనూ వర్తకుల ముద్రలకు, సుంకాల పట్టీలకు, పాలకుల ప్రకటనలకు లిపి ఆధారమైంది. శిలాక్షర రూపాల్లో శాసనాలు లిఖించబడ్డాయి. తర్వాతి దశలో అంతవరకూ మౌఖికంగా ఉండిన జానపద గాథలకు