రేపు నాగార్జునసాగర్ లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్
Actor ProfilePolitician

రేపు నాగార్జునసాగర్ లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేపు నాగార్జునసాగర్ లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్
Andhra Jyothy22 Nov 2026
రేపు నాగార్జునసాగర్ లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్

నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఈ యాగం నిర్వహించనున్నారు. రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సీఎం బయలుదేరనున్నారు. రేపు 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు సీఎం చేరుకోనున్నారు. అక్కడి నుంచి విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో జరిగే యాగం వద్దకు రేవంత్‌రెడ్డి చేరుకోనున్నారు. యాగం ముగిసిన అనంతరం 4 గంటలకు హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో విజయ్ విహార్‌లో వరుణ యాగం నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో వ‌రుణ‌యాగం జరిపిస్తారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పించనున్నారు. అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్ సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్