
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP Rain Alert: ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడగా.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని తెలిపింది. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు ప్రకటించారు. వాయవ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. స్పష్టమైన అల్పపీడనంగా బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని సూచనలు చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. వీటి ప్రభావంతో రేపు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. అంతేకాకుండా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ