
రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అలియాస్ జోసెఫ్ బచలకురి అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోనూ పెను దుమారం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రావణ్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపగా, ఈ ఘటనపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాత బండ్ల గణేశ్ మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదురుతోంది.ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఫైర్: 'గేమ్ ఆన్' అంటూ హెచ్చరికప్రశ్న రావణ్కు గన్నవరం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంపై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఇవాళ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. "పోలీసులు పెట్టిన తప్పుడు కేసుల్లో కోర్టు నాలుగుసార్లు బెయిల్ మంజూరు చేసినా, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి రిమాండ్కు పంపడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహులు అయిపోతారా?" అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. ఇది కేవలం ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు.రావణ్ ఫోన్ పోలీసుల వద్దే ఉందని, అందులోని వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసి అతడిని, అతనికి మద్దతుగా నిలిచే వారిని మానసికంగా వేధించే ప్రమాదం ఉందని ప్రకాశ్ రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. "మీ ఆట ప్రొఫెసర్ నాగేశ్వర్తో మొదలైంది. దీనికి ప్రజలే