రైతు బీమా మాయం.. తెలంగాణలో మారనున్న రూల్స్.. రేషన్ కార్డు ఉండాల్సిందేనా
Actor ProfilePolitician

రైతు బీమా మాయం.. తెలంగాణలో మారనున్న రూల్స్.. రేషన్ కార్డు ఉండాల్సిందేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రైతు బీమా మాయం.. తెలంగాణలో మారనున్న రూల్స్.. రేషన్ కార్డు ఉండాల్సిందేనా
Zee Telugu26 Oct 2026
రైతు బీమా మాయం.. తెలంగాణలో మారనున్న రూల్స్.. రేషన్ కార్డు ఉండాల్సిందేనా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Rythu Bima: తెలంగాణ రైతులకు ప్రధాన ఆసరాగా నిలుస్తున్న రైతు బీమా పథకం కనుమరుగవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయడానికి యోచిస్తున్నట్లు సమాచారం. ఇందిరా గాంధీ జయంతి అయిన నవంబర్ 19న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. 2018లో ప్రారంభించిన ఈ పథకం ఏటా 25,000 కుటుంబాలకు పరిహారం అందిస్తుంది. రైతులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆగస్టు 14న ప్రీమియం చెల్లిస్తుంది. తొలుత ఈ పథకానికి 31.25 లక్షల మంది అర్హులు అవ్వగా.. ఈ ఏడాది 42.16 లక్షల మంది అర్హులయ్యారు. అయితే, ప్రతి సంవత్సరం ఈ పథకంలో చేరే కొత్త రైతుల సంఖ్య కంటే అనర్హుల సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి ఏటా 59 ఏళ్లు పైబడిన రైతులను ఈ పథకం నుంచి మినహాయిస్తున్నారు. పెద్ద ఎత్తున భూమిని పంపిణీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.50 లక్షల బీమా కవరేజీని అమలు చేశారు. ఒక రైతు మరణించినట్లయితే చెందితే, వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం లభిస్తుంది. అయితే, ఈ పథకాన్ని రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వార్షిక ప్రీమియంలో 70 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుండగా, మిగిలిన 30 శాతాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలును వేగవంతం చేసింది. వివిధ కారణాల వల్ల కుటుంబ పెద్ద మరణిస్తే, ఆ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం లభిస్తుంది. రాష్ట్రంలోని