రాజకీయ శత్రుత్వానికి బలయ్యారు..మాజీ డిప్యూటీ స్పీకర్ మృతి
Actor ProfilePolitician

రాజకీయ శత్రుత్వానికి బలయ్యారు..మాజీ డిప్యూటీ స్పీకర్ మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజకీయ శత్రుత్వానికి బలయ్యారు..మాజీ డిప్యూటీ స్పీకర్ మృతిపై మమతా బెనర్జీ తీవ్ర ఆవేదన
Samayam Telugu1 Jan 2027
రాజకీయ శత్రుత్వానికి బలయ్యారు..మాజీ డిప్యూటీ స్పీకర్ మృతిపై మమతా బెనర్జీ తీవ్ర ఆవేదన

టీఎంసీ సీనియర్ నాయకుడు, తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వేధింపులు, తీవ్రమైన మానసిక ఒత్తిడే ఆయన మరణానికి కారణమని ఆమె ఆరోపించారు. ‘‘క్రూరమైన రాజకీయ శత్రుత్వానికి బలయ్యే మనుషుల ప్రాణాల విలువేంటో మనందరినీ ఒక్కసారి ఆగి, ఆలోచించేలా ఈ ఘటన చేస్తోంది’’ అని దీదీ ఆవేదనకు గురయ్యారు. ఆశిష్ బెనర్జీని ‘‘పదే పదే అవమానించి, అబద్ధపు ఆరోపణలు మోపి, తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు’’ మమతా బెనర్జీ వాపోయారు. పార్టీ కార్యాలయంలో ఆశిష్ బెనర్జీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.‘‘తన చివరి రోజుల్లో ఆయన పడిన తీవ్ర మానసిక ఒత్తిడి ఈ విషాదాన్ని మరింత వేదనకు గురిచేస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ డిప్యూటీ స్పీకర్‌గా, చైర్మన్‌గా ఆశిష్ దా రాంపూర్ హట్ ప్రాంత అభివృద్ధికి తనను తాను అంకితం చేసుకుని, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు.. ప్రజలకు ఆయన అంత సేవ చేసినప్పటికీ, ఆయనను పదే పదే అవమానించారు, నిందలు వేశారు, తట్టుకోలేని ఒత్తిడికి గురిచేశారు’’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మమతా బెనర్జీ రాసుకొచ్చారు.‘‘సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేసినప్పటికీ ఆయన ఎదుర్కొన్న వేధింపులు, మానసిక ఒత్తిడి.. కక్షపూరిత రాజకీయాల వల్ల ఎంతటి తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ ఘటన అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, పాత విద్యార్థులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన లేని లోటు ఎప్పటికీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు.అటు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సైతం ఆశిష్ బెనర్జీ మృతికి సంతాపం తెలిపారు. ఆయన విషాదకర మరణానికి దారితీసిన పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్‌లో నివాళులర్పించిన అభిషేక్.. ‘జీవితాంతం ఉపాధ్యాయుడిగా, ప్రజాసేవకుడిగా’ ఉంటూ బీర్భూమ్ ప్రజలకు గౌరవం, నిజాయితీతో