
రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని.. ఏ రైతూ కోర్టుకు ఎందుకు రాలేదు?.. పరిహారం కోసం వారు పిటిషన్ వేశారా? ఓ పార్టీ వ్యక్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.. సమీకరణ అంటే సివిల్ కేసు కదా క్రిమినల్ కుట్రగా మార్చడం రాజ్యాంగ విరుద్ధం.. దురుద్దేశంతోనే ‘అమరావతి’పై కేసు నిజమైన బాధితులు వస్తే న్యాయం చేస్తాం.. అమరావతి భూసమీకరణ కేసు కొట్టివేత చంద్రబాబు, నారాయణలకు ఊరట.. హైకోర్టు తీర్పును సమర్థించిన సీజేఐ బెంచ్ ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను వాడుకోవద్దు. నిజమైన బాధితులు (రైతులు) కోర్టుకు వస్తే చట్టం ప్రకారం న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయ నేతలు ప్రజా ప్రయోజనం పేరుతో తమ రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయడం తప్పు.’’ ‘‘ఒక్క రైతు అయినా నేరుగా ముందుకు వచ్చి నష్టపరిహారం కావాలని కోర్టులో పిటిషన్ వేశారా? ఫిర్యాదు చేశారా? ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే ఎస్సీ/ఎస్టీ రైతుల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు తప్ప, ఒక్క రైతుగానీ, సామాజిక వర్గం వ్యక్తిగానీ నేరుగా ముందుకు రాలేదు.’’ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటాలకు న్యాయస్థానాలను వాడుకోవడం సరికాదని హితబోధ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ‘‘అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ప్రధాన కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు