యజమాని డీపీతో ఫోన్ చేసి.. రూ.కోటి కొల్లగొట్టిన ముఠా
Actor ProfileCelebrity

యజమాని డీపీతో ఫోన్ చేసి.. రూ.కోటి కొల్లగొట్టిన ముఠా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యజమాని డీపీతో ఫోన్ చేసి.. రూ.కోటి కొల్లగొట్టిన ముఠా
Eenadu19 Jan 2027
యజమాని డీపీతో ఫోన్ చేసి.. రూ.కోటి కొల్లగొట్టిన ముఠా

చీరల వ్యాపారిని మోసగించిన నిందితుడి అరెస్టు బాధితునికి 100% సొమ్ము రీఫండ్‌ బాధితుడికి రూ.కోటి చెక్కు అందజేస్తున్న సైబరాబాద్‌ సీపీ రమేశ్, సైబర్‌ క్రైమ్‌ డీసీపీ పుష్ప. చిత్రంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ మన్‌మోహన్‌ తదితరులు ఈనాడు, హైదరాబాద్‌ రాయదుర్గం, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్ల బారిన పడి పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయిన బాధితుడు వెంటనే సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 100% సొమ్ము తిరిగి వచ్చిన ఉదంతమిది. ఈ కేసులో అంతర్రాష్ట్ర నిందితుడు దీపక్‌కుమార్‌(37)ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బుధవారం సైబర్‌క్రైమ్‌ డీసీపీ పుష్ప, ఏసీపీ రవీందర్‌రెడ్డిలతో కలిసి సీపీ రమేశ్‌ వివరాలు తెలిపారు. హైదరాబాద్‌ నిజాంపేట్‌లోని ఓ రిటైల్‌ చీరల దుకాణంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఈ నెల 4న యజమాని డీపీతో వాట్సప్‌ కాల్‌ వచ్చింది. వెంటనే రూ.కోటి నగదును తాను సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని అవతలి వ్యక్తి ఆదేశించారు. వ్యాపార లావాదేవీల్లో భాగమని భావించిన ఆయన... నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో చెప్పినంత సొమ్ము జమచేశారు. నగదు బదిలీ జరగ్గానే అసలు యజమాని ఫోన్‌కు బ్యాంకు నుంచి మెసేజ్‌ రావటంతో ఆయన అప్రమత్తమయ్యారు. అకౌంటెంట్‌కు ఫోన్‌ చేసి నగదు గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సైబర్‌ మోసంగా భావించిన బాధితుడు 1930 నంబర్, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ మన్‌మోహన్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. నగదు జమయిన బ్యాంకు ఖాతాను స్తంభింపజేసి, అక్కడ లభించిన సమాచారం ఆధారంగా ఆరా తీస్తే మాయగాళ్ల బండారం వెలుగులోకి వచ్చింది. ‘యూపీలోని లఖ్‌నవూకు చెందిన దీపక్‌కుమార్‌(37) వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అంజు, ఆకాశ్‌ సులభంగా డబ్బు సంపాదించేందుకు సైబర్‌ మోసాలను ఎంచుకున్నారు. కొట్టేసిన నగదు జమ చేసేందుకు కరెంట్‌ ఖాతా అవసరం కావడంతో దీపక్‌కుమార్‌తో చేతులు కలిపారు. ముగ్గురూ కలిసి రూ.600 కోట్ల టర్నోవర్‌తో వెల్‌నెస్‌