
Donald Trump: ట్రంప్కు ‘ట్రూత్ సోషల్’ దెబ్బ.. ఏకంగా రూ.2,000 కోట్ల నష్టం.. ఇక దానిపైనే ఫోకస్ నూతన మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరి 1, 2027 నుండి వైపీపీ ద్వారా ప్రకటనల ఆదాయం పొందాలంటే కొత్త క్రియేటర్లకు లక్ష్యాలు రెట్టింపయ్యాయి. ఛానెల్ మోనిటైజ్ కావడానికి గడిచిన 365 రోజుల్లో 8,000 వాచ్ హవర్స్ పూర్తి చేయాలి లేదా 90 రోజుల్లో 20 మిలియన్ల (2 కోట్లు) షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. అయితే 1,000 సబ్స్క్రైబర్ల నిబంధనలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో సభ్యులుగా ఉన్న దాదాపు 30 లక్షల మంది పాత క్రియేటర్లకు ఈ కొత్త ఎంట్రీ నిబంధనల నుండి మినహాయింపునిస్తూ ఉపశమనం కల్పించారు. పాత, కొత్త క్రియేటర్లు ఇద్దరికీ వర్తించేలా షార్ట్స్ మోనిటైజేషన్పై యూట్యూబ్ మరో కీలక నిబంధన విధించింది. షార్ట్స్ ద్వారా నిరంతరం ప్రకటనల ఆదాయం పొందాలంటే ప్రతి 90 రోజులకు కనీసం 10 మిలియన్ల వ్యూస్ కొనసాగించాల్సిందే, వ్యూస్ తగ్గితే షార్ట్స్ ఆదాయం నిలిచిపోతుంది. అదే సమయంలో ఫ్యాన్ ఫండింగ్ దిగువ స్థాయి నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. కాగా, భారత్లో నెలకు కేవలం రూ.89లకే అందుబాటులో ఉన్న ‘ప్రీమియం లైట్’ సబ్స్క్రిప్షన్ను గ్లోబల్గా విస్తరిస్తూ, దాని ద్వారా వచ్చే నికర ఆదాయంలో 60 శాతం వాటాను క్రియేటర్లకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది