మళ్లీ పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్ లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం
Actor ProfilePolitician

మళ్లీ పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్ లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మళ్లీ పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్ లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం
AP7AM25 Nov 2026
మళ్లీ పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్ లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం

భారతీయ వినియోగదారులపై మరోసారి ధరల భారం పడనుంది. రోజువారీ ఉపయోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర నిత్యావసర వస్తువుల (ఎఫ్ఎంసీజీ) ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడిసరుకుల ధరలు పెరగడంతో, తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో ఈ ధరల పెంపు ఉండనుందని తెలుస్తోంది.ఇప్పటికే జూన్ త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు 2 నుంచి 5 శాతం వరకు ధరలు పెంచాయి. అయినప్పటికీ ముడిసరుకుల వ్యయం పూర్తిగా భర్తీ కాలేదని, అందుకే మరోసారి ధరలను సమీక్షించక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు ధరలు పెంచడానికి బదులుగా 'ష్రింక్‌ఫ్లేషన్' బాట పట్టనున్నాయి. అంటే, ప్యాకెట్ ధరను మార్చకుండా, లోపల ఉన్న సరుకు పరిమాణాన్ని తగ్గించడమే ఈ వ్యూహం.ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా, ప్రస్తుత త్రైమాసికంలో 1.5 నుంచి 2 శాతం వరకు ధరల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా రూ.5, రూ.10 ప్యాకెట్ల పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉంది. పంచదార, పామాయిల్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఇదే బాటలో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్‌) కూడా రాబోయే త్రైమాసికంలో 2 నుంచి 5 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తూ, వివిధ కేటగిరీలలో ధరలను పెంచనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. డాబర్, గోద్రెజ్ కన్స్యూమర్, టాటా కన్స్యూమర్ వంటి సంస్థలు కూడా ముడి వ్యయం తగ్గకపోతే ధరలు పెంచే అవకాశాన్ని తోసిపుచ్చలేదు.విచిత్రం: మద్యంపై మాత్రం పెరుగుతున్న ఖర్చుఒకవైపు నిత్యావసరాల ధరల