
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Wife Harpic injected into husband veins in Nizamabad: ఇటీవల ప్రతిరోజు భార్యభర్తలకు చెందిన హత్యలు వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల భర్తలు తమ భార్యల్ని చంపుతుంటే, మరికొన్నిచోట్ల భార్యలు తమ భర్తల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వాళ్లను కాటికి పంపుతున్న ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం నిజామాబాద్ పట్టణంలోని న్యాల్కల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్, సంధ్య ఇద్దరు భార్య భర్తలు. వీరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సంధ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎలాగైన భర్తను మట్టుపెట్టాలని పక్కా ప్లాన్ వేసింది. భర్తను తన ప్రియుడితో కలిసి పీలక దాక తాగించింది. ఆ తర్వాత మద్యం మత్తులో ఉండగా భార్య, ప్రియుడు కలసి బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశారు. దీంతో ప్రశాంత్ కింద పడి తలకు బలమైన గాయమైంది. కానీ అతను చనిపోలేదు. ఆ తర్వాత భార్య సంధ్య, ప్రియుడు కలసి సిరంజీతో ఇంట్లో ఉన్న హర్పిక్ ను నరాల్లోకి ఎక్కించారు. దీంతో కాసేపటికే ప్రశాంత్ విగత జీవిగా మారిపోయాడు. ఈ క్రమంలో తన భర్త చనిపోయాడని చెప్పడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా సంధ్య అసలు విషయం అంగీకరించింది. Read