మన్మోహన్ సింగ్ భవితవ్యాన్ని మార్చేసిన ఇంటర్వ్యూ
Actor ProfilePolitician

మన్మోహన్ సింగ్ భవితవ్యాన్ని మార్చేసిన ఇంటర్వ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మన్మోహన్ సింగ్ భవితవ్యాన్ని మార్చేసిన ఇంటర్వ్యూ
TeluguOne7 Dec 2026
మన్మోహన్ సింగ్ భవితవ్యాన్ని మార్చేసిన ఇంటర్వ్యూ

2012 ఫిబ్రవరి 24న ప్రతిష్ఠాత్మక అమెరికన్ శాస్త్రీయ పత్రిక సైన్స్ లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ, ఆ తర్వాతి కాలంలో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన అమెరికా, స్కాండినేవియన్ దేశాల నుంచి నిధులు అందుకుంటున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) భారత అభివృద్ధి సవాళ్లను పూర్తిగా అర్థం చేసుకోకుండా, కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు వంటి కీలక పథకాలను అడ్డుకుంటున్నాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సాంకేతిక చర్చకే పరిమితం కాకుండా, దేశంలో విదేశీ నిధుల పాత్రపై, పౌర సమాజం పరిధిపై విస్తృత చర్చకు దారితీశాయి. 2012 ఫిబ్రవరి 24న ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూలో.. మన్మోహన్ సింగ్ కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు, బీటీ బ్రింజాల్ విడుదలపై విధించిన నిషేధం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. దేశాభివృద్ధిలో అడ్డంకులు కల్పిస్తున్న ఎన్జీవోల గురించి బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో.. అమెరికా, స్కాండినేవియన్ దేశాల నుండి తరచుగా నిధులు పొందుతున్న కొన్నిఎన్జీవోలు, ఇండియా ఎదుర్కొంటున్న అభివృద్ధి సవాళ్లను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్న కూడంకుళం వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో వచ్చాయి. ఇవి ఆయా ఎన్జీవోల నిర్వాహకుడు ఎస్.పి.ఉదయకుమార్ నేతృత్వంలో సాగుతున్నాయి యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో (2009–2014) దేశంలో అణు విద్యుత్ ప్రాజెక్టులు, ముఖ్యంగా తమిళనాడులోని కూడంకుళం ప్లాంటు, స్థానిక మత్స్యకార సంఘాలు, పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. ఫుకుషిమా అణు దుర్ఘటన (2011) తర్వాత ఈ నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మన్మోహన్ సింగ్ సైన్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ నిరసనల వెనుక విదేశీ నిధులు పొందిన కొన్ని సంస్థల పాత్ర ఉందని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా మిగలకుండా, తదనంతర కాలంలో నిఘా వర్గాల నివేదికలకు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)