
కృష్ణమ్మ ఒడికి గోదారమ్మ నీళ్లు చేరుతుండటంతో కృష్ణా డెల్టా పరిధిలో వ్యవహారం కళకళలాడుతోంది. విజయవాడలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రకాశం బ్యారేజీ వద్ద తన కాన్వాయ్ను కొద్దిసేపు నిలిపివేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి కృష్ణా నదిలోకి చేరుతున్న జలాలను, నిండుకుండలా మారిన బ్యారేజీ ప్రాంగణాన్ని ఆయన ఆసక్తిగా పరిశీలించారు. గోదావరి నీటి రాకతో ప్రకాశం బ్యారేజీ ఎంతో ఆహ్లాదకరంగా, శోభాయమానంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా సీఎం ఆనందం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు కృష్ణాలోకి 17.52 టీఎంసీల తరలింపుప్రస్తుత సీజన్లో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదిలోకి విజయవంతంగా తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాల వల్ల గోదావరి నుంచి దాదాపు 521 టీఎంసీల నీరు సముద్రంలోకి కలిసిపోయిందని తెలిపారు. అయినప్పటికీ పట్టిసీమ ద్వారా వస్తున్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.అక్కడ అన్ని గేట్లు ఎత్తివేత- శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లుసాగునీటి విడుదల... డెల్టా పంటలకు ప్రాణవాయువురైతుల పంట పొలాలకు ఎలాంటి నీటి ఎద్దడి కలగకుండా బ్యారేజీ నుంచి దిగువ కాల్వలకు నీటి విడుదల ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 3,115 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్కు 115 క్యూసెక్కుల చొప్పున మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు.అప్పుడే కృష్ణమ్మ పరవళ్లు- ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఓపెన్.. !!ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో పట్టిసీమ జలాలు రైతన్నల పంటలకు జీవకళను తీసుకువస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన