భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను ఓలలాడించిన స్వరకోకిల, లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జానకమ్మ భౌతికంగా మనల్ని విడిచివెళ్లడంపై సంగీత లోకం కన్నీరు మున్నీరవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు అత్యంత సన్నిహితురాలు, సమకాలీనురాలైన మరో దిగ్గజ గాయని పి. సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.* విజయ్ దేవరకొండ రియల్ హీరో మార్క్.. అభిమాని కన్నీళ్లకు చలించిపోయిన ‘రౌడీ స్టార్’మా మధ్య గొడవలు పెట్టారుజానకమ్మ మృతిపై పి. సుశీల స్పందిస్తూ తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారు. తమ కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో కొంతమంది స్వార్థపరులు చేసిన కుట్రలను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "గతంలో కొందరు వ్యక్తులు మా ఇద్దరి మధ్య లేనిపోని విభేదాలు సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. నా గురించి జానకికి, జానకి గురించి నాకు లేనిపోని అబద్ధాలు చెబుతూ మమ్మల్ని మానసికంగా తీవ్రంగా వేధించారు, ఏడిపించారు" అంటూ సుశీల మండిపడ్డారు. జానకమ్మ మరణంతో ఆనాడు తమ మధ్య దూరం పెంచాలని చూసిన ఆ దుర్మార్గులందరి 'కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?' అంటూ ఘాటుగా విమర్శించారు. వారి కుట్రల వల్ల తాము మానసిక వేదన అనుభవించామని సుశీల కన్నీటి పర్యంతమయ్యారు.* ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఒకే స్క్రీన్ పై.. ‘తమిళ మురుగన్’లో విజయ్ సేతుపతి ఎంట్రీ? జానకి లాంటి గాయని మళ్లీ పుట్టదుజానకమ్మ గాత్ర వైవిధ్యాన్ని కొనియాడుతూ.. ఆమె ఒక అద్భుతమని సుశీల ప్రశంసించారు. ఎస్. జానకి గొంతులో మగవారి శబ్దాలు, వృద్ధుల గొంతులు, చిన్న పిల్లల మాటలు ఎంత అద్భుతంగా పలికేవో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రేక్షకులను తన గానంతో ఎలా కట్టిపడేయాలో జానకమ్మకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో మరెవరికీ తెలియదని కొనియాడారు. అలాంటి
Actor ProfileActor
మా మధ్య గొడవలు పెట్టారు.. ఇప్పుడు వారి కళ్లు చల్లబడతాయ్.. పి. సుశీల భావోద్వేగం
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•5 Nov 2026
మా మధ్య గొడవలు పెట్టారు.. ఇప్పుడు వారి కళ్లు చల్లబడతాయ్.. పి. సుశీల భావోద్వేగం