మేధో నక్సల్స్ ’తో ముప్పు
Actor ProfilePolitician

మేధో నక్సల్స్ ’తో ముప్పు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మేధో నక్సల్స్ ’తో ముప్పు
Eenadu30 Dec 2026
మేధో నక్సల్స్ ’తో ముప్పు

సాయుధ నక్సలైట్లను అంతమొందించాంగానీ.. వీరింకా పొంచి ఉన్నారు ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ హెచ్చరిక మహిళా రిజర్వేషన్ల అమలుకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలకు పిలుపు ఉజ్వల భారతానికి ‘సప్తధార’ అగ్ర దేశాల సరసన చేరేందుకు 7 మార్గాలను అనుసరించాలని ప్రజలకు పిలుపు యువతపై వరాల జల్లు పౌర రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడి 13వసారి జాతీయ జెండా ఆవిష్కరణ ఖర్గే, రాహుల్‌ గాంధీ గైర్హాజరు దిల్లీలోని ఎర్రకోట వద్ద విద్యార్థులతో కరచాలనం చేస్తున్న ప్రధాని మోదీ ఈనాడు, దిల్లీ: ‘ఎర్రకోటలో త్రివర్ణ పతాకం నీడన నిల్చుని దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ప్రార్థిస్తున్నా. అభ్యర్థిస్తున్నా. వీలైనంత త్వరగా అసెంబ్లీ, పార్లమెంట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసేందుకు సహకరించండి. వారిని గౌరవించే కార్యక్రమంలో మీరూ భాగస్వాములు కండి. ఆ కీర్తిని మూటగట్టుకోండి. క్రెడిట్‌ను తీసుకోండి’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో యువత పాలుపంచుకోవాలని సూచించారు. దేశంలో సాయుధ నక్సలిజాన్ని నిర్మూలించామని, అయితే మేధో నక్సలిజం ఇంకా పొంచి ఉందని, దాని నుంచి ప్రమాదం పోలేదని ప్రధాని హెచ్చరించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై శనివారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీంతో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ (17సార్లు) తర్వాత అత్యధికంగా 13 సార్లు జాతీయ జెండాను ఎగరేసిన ఘనతను మోదీ సొంతం చేసుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని 75 నిమిషాలపాటు జాతినుద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ల నుంచి జెన్‌-జీదాకా అనేక అంశాలను ప్రస్తావించారు. 12ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. అగ్రదేశాల సరసన చేరటానికి.... భారత్‌ వ్యూహాత్మక, ఆర్థిక వృద్ధికి ఆయన ‘సప్తధార’ పేరుతో మార్గసూచీని ప్రకటించారు. ‘‘చాలాకాలంపాటు మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు.. అధికార వ్యవస్థల్లోనూ, ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగానూ ఉండి విధానాలను ప్రభావితం చేశారు. ఈ మావోయిస్టు మైండ్‌సెట్‌ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసింది. మేం