
మేడ్చల్లోని ఓ పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. పదోతరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు. మేడ్చల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్లోని ఓ పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. పదోతరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు. కామారెడ్డికి చెందిన విద్యార్థి అభిషేక్ రెడ్డిపై 8 నుంచి 10 మంది దాడి చేసినట్లు సమాచారం. కర్రలు, భోజనం ప్లేట్లతో కొట్టి.. బూట్లతో అభిషేక్ రెడ్డి ముఖంపై విద్యార్థులు తొక్కినట్లు తెలుస్తోంది. ఈ దాడి ధాటికి మెట్లపై నుంచి బాధితుడు కింద పడిపోయాడు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందజేశారు. అభిషేక్ రెడ్డిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్ సీనియర్ సిటిజన్లే టార్గెట్గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్