
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థుల్లో విషాదం నెలకొంది. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్యా మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దుష్యంత్, ఆండ్రూ అనే ఇద్దరు యువకులు కారుతో ప్రియాంకను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో తొలుత స్థానికంగా చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు ప్రియాంకకు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ప్రియాంక మృతితో ఘటనపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రియాంకకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత, మాజీ ఎంపీ, రాజమండ్రి సిటీ ఇంచార్జి మార్గాని భరత్ కీలక నిర్ణయం ప్రకటించారు. రేపు రాజమండ్రి బంద్కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు కూడా బంద్లో పాల్గొని సంఘీభావం తెలపాలని ఆయన కోరారు. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరును భరత్ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులపై కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆయన ఆరోపించారు. నిందితులను రక్షించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో ప్రభుత్వం, పోలీసులు