
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భారత సైనికులతో కలిసి సందడి చేశారు. జమ్మూకాశ్మీర్లోని ఉరీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన సైనికులతో ముచ్చటించారు. ‘ప్రపంచవ్యాపంగా జరుగుతున్న యుద్ధాల కోసం నా పిల్లలు తైమూర్, జెహ్ తరుచూ నన్ను అడుగుతుంటారు. ఆ యుద్ధాలను చూసి పిల్లలు భయపడుతుంటారు. మమ్మల్ని ఎవరు కాపాడతారు? పరిస్థితులు మరింత దిగజారుతాయా? అని అడుగుతుంటారు. అప్పుడు నేను భారత సైన్యం మనల్ని రక్షిస్తోందని చెబుతుంటాను’ అని సైఫ్ తెలిపారు. కాశ్మీర్ దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటన్నారు. తన తల్లి, ప్రముఖ నటి షర్మిలా ఠాగుర్ నటించిన తొలి చిత్రం ‘కశ్మీర్ కీ కలి’ తో పాటు అనేక చిత్రాల పాటలు కశ్మీర్లోనే చిత్రీకరణ జరిగిందని తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సైఫ్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైవాన్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తరువాత అక్షయ్కుమార్తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రం సెప్టెబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా