భారత్ ముందున్న అసలు సవాలేంటి
Actor ProfilePolitician

భారత్ ముందున్న అసలు సవాలేంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారత్ ముందున్న అసలు సవాలేంటి
Oneindia Telugu6 Oct 2026
భారత్ ముందున్న అసలు సవాలేంటి

భారతదేశ రవాణా రంగం ప్రస్తుతం ఒక చారిత్రక పరివర్తన దశను ఎదుర్కొంటోంది. కాలుష్య రహిత భవిష్యత్తు వైపు సాగుతున్న ప్రయాణంలో భారత్ ఒకేసారి రెండు భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో మొదటిది 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20 ఇంధనం) కాగా, రెండోది బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు). కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రతిపాదనలను కేవలం ఏదో ఒకటి ఎంచుకునే అంశంగా కాకుండా, దేశ ప్రయోజనాల దృష్ట్యా పరస్పరం సమతుల్యం చేస్తూ ముందుకు తీసుకువెళ్తోంది.ఇథనాల్ వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్-సుప్రీంలో గుట్టు రట్టు..!ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)తక్కువ కాలంలోనే దేశ ఇంధన భద్రతను సాధించడానికి, దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి E20 బాగా ఉపయోగపడింది. ఈ స్వదేశీ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల దాదాపు రూ. 1.4 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. చెరకు, మొక్కజొన్న పండించే రైతులకు ఇది పెద్ద వరంగా మారింది. అయితే, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే E20 వల్ల మైలేజీ దాదాపు 3 నుంచి 6 శాతం తగ్గుతుంది. అంతేకాకుండా, 2023 ఏప్రిల్ లోపు తయారైన పాత వాహనాల కారు, బైక్ ఇంజన్లు దీనివల్ల త్వరగా పాడయ్యే ముప్పు ఉంది.విద్యుత్ వాహనాలు దీర్ఘకాలిక పర్యావరణ లక్ష్యాల సాధనకు ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సహిస్తోంది. పీఎం ఇ-డ్రైవ్ మరియు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (PLI) వంటి పథకాలతో పాటు ఈవీల పై జీఎస్టీని కేవలం 5 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ, ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన అత్యంత కీలకమైన ఖనిజాల కోసం ఇతర దేశాల పైనే భారత్ ఆధారపడాల్సి వస్తోంది. దీనికి తోడు, పట్టణ ప్రాంతాలు దాటితే సరైన ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వల్ల సుదూర ప్రయాణాలు చేసే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ ఇథనాల్ పెట్రోల్ కు ఓ దండంకేంద్రం ప్లాన్ ఇదే..