భూకబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
Actor ProfilePolitician

భూకబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భూకబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
HMTV31 Dec 2026
భూకబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

AP: భూకబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి వాసంశెట్టి సుభాష్! AP: తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు ఉంటే వాటిని అధికారుల ముందు ఉంచాలని, మీడియా వేదికగా ఆరోపణలు చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదని అన్నారు. రంగబాబు అనే వ్యక్తి జూలై 17న గ్రీవెన్స్ కార్యక్రమంలో తనకు ఫిర్యాదు చేశారని మంత్రి తెలిపారు. ఆ ఫిర్యాదులో జోగు రమేష్ అనుచరులు తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నట్లు వివరించారు. ఇదే వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా సంబంధిత వ్యక్తులు ఆందోళనకు దిగిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. జోగి రమేష్‌తో పాటు మండలి చైర్మన్ మోషేన్ రాజు కూడా తన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ జూన్ 6న ధర్నా నిర్వహించారని మంత్రి పేర్కొన్నారు. ఆ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు భూమి ఎవరిది? దానికి సంబంధించిన హక్కులు ఎవరికి ఉన్నాయి? అనే విషయాన్ని అధికారిక రికార్డుల ఆధారంగా తేల్చాలని సూచించారు. భూమి వివాదాల విషయంలో సర్వే నంబర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, ఇతర అధికారిక ఆధారాలే కీలకమని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత పత్రాలను పరిశీలించి అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఎవరి హక్కు ఎంతవరకు ఉందో రికార్డుల ఆధారంగా నిరూపించుకోవాలని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిగా తనపై ఎవరైనా ఆరోపణలు చేస్తే మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. అందుకే తాను స్పందిస్తున్నానని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరారు. నిజంగా ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే పోలీసులను